Sunday, April 26, 2015

విషాద నేపాలం..

కనీ వీనీ ఎరగని విషాదం.. దేశానికి దేశమే శిథిలాల దిబ్బగా మారింది.. వేలాది మంది మృతవాత పడ్డారు.. భూతల స్వర్గంలా ఉండే నేపాల్ క్షణాల్లో మరుభూమిగా మారింది.. కళ్లీ ముందే భవనాలు వణికిపోతూ, భూమి చీలిపోతుంటే జనం భయంలో పరుగులు తీశారు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే రాజధాని ఖాఠ్మండూలో అత్యధిక నష్టం జరిగింది. ప్రపంచ చారిత్రిక సంపదగా గుర్తించిన నేలమట్టమైంది. భూకంప తాకిడికి మరణించిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. భూకంపం రాగానే మన దేశం స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.. కేవలం ప్రభుత్వాలు స్పందిస్తే సరిపోదు.. భారతీయులంతా మన పొరుగుదేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అనాధిలో మనతో చారిత్రిక, సాంస్కృతిక, మతపరమైన సంబంధాలు ఉన్న నేపాలీలకు సాయపడదాం..

No comments:

Post a Comment