Monday, April 13, 2015

జర్నలిస్టులైన పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తెలుగు నాట గత 48 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న శ్రీ సరస్వతీ శుశు మందిరాలలో లక్షలాది మంది విద్యాభ్యాసం చేసి వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారు. వీరిలో జర్నలిస్టులైన పూర్వ విద్యార్థులు, పూర్వాచార్యుల కోసం శ్రీ సరస్వతీ విద్యా పీఠం పూర్వ విద్యార్థి పరిషత్ ఒక సమ్మేళనం నిర్వహిస్తోంది. 19-04-2015 (ఆదివారం) నాడు శారదాధామంలో ఉ.10 గం. నుండి సా.4 గం. వరకూ జరిగే ఈ సమ్మేళనంలో జర్నలిస్టులైన పూర్వ విద్యార్థులు, పూర్వాచార్యులు తప్పని సరిగా హాజరు కావాలని మనవి. ఇతర వివరాలు, సంప్రదింపుల కోసం ఆహ్వానపత్రం చూడగలరు. ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయాలని, షేర్ చేయాలని ప్రత్యేక మనవి

No comments:

Post a Comment