Wednesday, April 29, 2015

సాయమా?.. మత ప్రచారమా?

నేపాల్ భూకంపం ప్రపంచాన్ని కదిలించింది.. భారత్ సహా అన్ని దేశాలు పెద్ద ఎత్తున సాయం చేసేందుకు రంగంలోకి దిగాయి.. ఇలాంటి సమయంలో త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 1,00,000 గిడియాన్ బైటిల్ ప్రతులు దిగాయి.. వారిని చూసి నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కుమార్ కోయిరాలా అగ్గిమీద గుగ్గిలమైపోయారు..
ఇదేం తెలివి తక్కువ పని.. నేపాల్ ఏమైనా మోటెల్ (హోటల్) అనుకుంటున్నారా?.. మేము బైబిల్స్ తనలేము.. వాటిని గడ్డపారలుగా కూడా ఉపయోగించలేం.. నేపాల్ కు ఇప్పుడు ఆహారం, మందులు, సహాయ సామాగ్రి, కార్మికులు కావాలి.. బెస్ట్ సెల్లర్ పుస్తకాలు కాదు..అంటూ ఆగ్రహం వ్యక్త చేశారు కోయిరాలా..
‘’మీరు నేపాల్ కోసం ప్రార్ధనలు చేస్తే ధన్యవాదాలు.. కానీ బైబిల్స్ మాత్రం పంపకండిఅని స్పష్టం చేశారు కోయిరాలా..
నేపాల్ అధికారికంగా హిందూ రాజ్యం.. ప్రకృతి వైఫరీత్యం కారణంగా సర్వం కోల్పోయిన నేపాలీలను సాయం పేరిట మత మార్పిడి చేసేందుకు అవకాశవాదులు పొంచి చూస్తున్నారు.. ఇలాంటి సమయంలో నిజంగా సేవాభావంతో పని చేస్తున్నది ఎవరు? దుర్భుద్దికి సేవ ముసుగేసుకుంటున్నది ఎవరు అన్న విషయాన్ని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది..

గతంలో ఓ నియోజక వర్గ ప్రజలు నాయకురాలిని ఓడించింనందుకు హుద్ హుద్ వచ్చిందని సోషల్ మీడియాలో చాటుకున్న మత పిచ్చోళ్లు, ఇప్పుడు నేపాల్ విషయంలోనూ అదే తరహా ప్రచారానికి దిగారు.. తమ మతం వారిని నేపాలీలు హింసించినందుకే దేవుడు ఆ దేశాన్ని నాశనం చేశాడట.. హే ప్రభువా.. ఇలాంటి ప్రేలాపనలు చేసేవారిని క్షమిస్తావో, శిక్షిస్తావో నీ ఇష్టం.

No comments:

Post a Comment