Friday, April 24, 2015

గిల్గిత్ బాల్టిస్థాన్ పోరాట యోధుడు సెంగె హస్నన్ సెరింగె..

భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం జరిగే సమయంలో పాకిస్తాన్ దొంగచాటుగా ఆక్రమించిన భూభాగమే పాక్ ఆక్రమిత కాశ్మీర్.. ఇందులో గిల్గిత్ బాల్టిస్థాన్ అతి కీలకమైన భూభాగం. పాకిస్తాన్ పాలనలో మగ్గిపోతున్న అక్కడి ప్రజలు భారత దేశం వైపు ఆశగా చూస్తున్నారు. పాకిస్తాన్ చేతిలో అక్కడి ప్రజలు పడుతున్న బాధలపై పోరాడుతున్నారు ‘సెంగె హస్నన్ సెరింగె’. పాకిస్తాన్ దుష్ట విధానాలను, ఐఎస్ఐ అరాచకాలను అంతర్జాతీయ వేదికపై ఎండగడుతున్నారాయన.. ఇందులో భాగంగా భారత్ లో పర్యటిస్తున్నారు సెంగె హస్నన్.. ఈ నెల 25న ఆయన హైదరాబాద్ వస్తున్నారు..
ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాచిగూడలోని భద్రుకా కాలేజీ ఆడిటోరియంలో "The Unknown Kashmir : Plight of Gilgit Baltistan" అనే అంశంపై ప్రసంగిస్తున్నారు సెంగె హస్నన్ సెరింగె..
ఈ కార్యక్రమానికి మిత్రులంతా తప్పకుండా రావాలని వారి పోరాటాన్ని, అనుభవాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల పోరాటానికి మన సంఘీభావం ప్రకటిద్దాం.. అందరికీ ఇదే ఆహ్వానం..

No comments:

Post a Comment