Tuesday, June 9, 2015

ఎప్పటికీ యాదికుండు దాశరథి సోదరులు

అన్న వెంట తమ్ముడు.. ఇద్దరిదీ ఒకే బాట.. పోరాటమైనా, సాహిత్యమైనా.. అపూర్వ తెలంగాణ సోదరులు వీరు.. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య..

నా తెలంగాణ కోటి రతనాల వీణ.. మా నిజాము రాజు తరతరాల బూజు అంటూ నిరంకుశ పాలనపై తిరగబడి అగ్నిధారను కురిపించారు కృష్ణమాచార్య.. ఆగ్రహించిన ప్రభుత్వం జైలు పాలు  చేసింది.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతలు స్వీకరించిన రంగాచార్య అన్నయ్య చూపిన మార్గంలోనే నడిచాడు.. హైదరాబాద్ సంస్థానంలో చిల్లర దేవుళ్లను ఎండగట్టారు..

నిజాం పాలన అంతమయ్యాక ఉపాధి కోసం కృష్ణమాచార్య సినీ రంగంలో, రంగాచార్య ప్రభుత్వ ఉద్యోగాలను ఎంచుకొని తన సాహితీ సేవను కొనసాగించారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా గౌరవం అందుకున్న కృష్ణమాచార్య తన యాత్రాస్మృతిని 1987లో ముగించగా, రంగాచార్య పరిపూర్ణ జీవనయాగం ఇప్పుడు ముగిసింది.. తెలుగు సాహిత్యాన్ని మరింద పరిపుష్టం చేసేందుకు తమ వంతు కృషి చేసిన దాశరథి సోదరుల సేవలు విలువ కట్టలేనివి.. తెలుగు భాష ఉన్నత వరకూ ఈ తెలంగాణ సోదరుల సాహితీ సేవ యాదికుండిపోతుంది.. -క్రాంతి దేవ్ మిత్ర

No comments:

Post a Comment