Wednesday, June 17, 2015

వ్యంగ్యానికీ హద్దుంటుంది..

రాజకీయాలు నాయకులకు, సినీ నటులకు కార్యకర్తలు, అభిమానులు ఉంటారు.. తమ నేతలకు, హీరోలకు జిందాబాదులు, ప్రత్యుర్థులకు ముర్దాబాదులు సర్వసాధారణం. వీధుల్లో తిట్టుకోవడం, కొట్టుకోవడం అంతే సహజం. పత్రికలు, టీవీల ద్వారా ఇలాంటివి మరింత రక్తి కట్టిస్తుంటాయి.. సమాచార సాంకేతిక విప్లవం పుణ్యమా అని సోషల్ మీడియా వచ్చాక వీటి స్వరూపమే మారిపోయింది..
2014 సాధారణ ఎన్నికలకు ముందు నుండి రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాను ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారు.. ఫేస్ బుక్, గూగల్ ప్లస్, ట్విట్టర్, వాట్సప్ లు తమ భావ ప్రకటనకు వేదికలుగా మారాయి.. ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు, అవతలివారు ధీటుగా ఎదురుదాడికి దిగడంలాంటి చర్యలకు పత్రికలైతే ఒక రోజు, ఛానళ్లయితే ఒక పూట పట్టేది.. ప్రత్యక్ష ప్రసారాలు వచ్చాక ఎప్పటికప్పుడే తేలిపోతున్నాయి.. కానీ సోషల్ మీడియా వచ్చాక పత్రికలు, టీవీలకన్నా వేగంగా ఈ పని జరిగిపోతోంది.. ఇదంతా ఒక స్థాయి వరకూ బాగానే ఉంటుంది.. కానీ ఇప్పుడు వ్యవహారం శృతి మించిపోయింది..
మల్టీ మీడియా, యానిమేషన్ల సహకారంతో విచ్ఛల విడిగా ఫోటోలు మార్పింగులు చేస్తున్నారు.. ఇవి హాస్యానికి బదులు, అపహాస్యం, అసహ్యం కలిగించే రీతితో ఉన్నాయి.. గత కొన్ని రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న మార్ఫింగ్ ఫోటోలు ఇందుకు పరాకాష్ట.. గతంలో జగన్, బాలకృష్ణ ఈ దారుణాలకు బలయ్యారు.. ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబులు టార్గెట్ అయిపోయారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యమైన రాతలతో వారి అభిమానులు మానసిక ఆనందం పొందుతున్నారు.. తెలిసో తెలియకో అందరూ వారిటిని షేర్ చేసుకొని తరించిపోతున్నారు..

ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది.. అదే సమయంలో వాటికో హద్దు ఉంటుంది.. సోషల్ మీడియాలో మితిమీరిన భావ ప్రకటనా స్వేచ్ఛకు పగ్గాలు లేవనుకుంటే అమాయకత్వమే.. చట్టాలకు పదునైన కోరలు ఉంటాయని అంతా మరచిపోతున్నారు.. బాధ్యతగల పౌరులుగా మనవంతుగా ఇలాంటి అపహాస్య వ్యంగ్య చిత్రాలను వ్యతిరేకిద్దాం.. వీటికి నో చెప్పేద్దాం.. 

No comments:

Post a Comment