Monday, June 15, 2015

కౌటిల్యుని హక్కుల పత్రం అర్థశాస్త్రం

మాగ్నాకార్టా అనే హక్కుపత్రం రూపొంది 800 సంవత్సరాలు అయిందని పాశ్చాత్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆధునిక ప్రజాస్వామ్యానికి తొలి బీజం మాగ్నా కార్టా అని వారి నమ్మకం.. దైవాంశ సంభూతుడుగా భూమి మీద తిరుగులేని అధికారాలు చెలాయిస్తున్న రాజుకు అడుడకట్ట వేసింది మాగ్నా కార్టా అనే హక్కుల పత్రం అని అంటారు. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ దీని ద్వారానే పురుడు పోసుకున్నాయంటారు. 15 జూన్, 1215 నాడు బ్రిటన్ చక్రవర్తి కింగ్ జాన్ జారీ చేసిన మాగ్నాకార్టా ఇంగ్లాండ్లో పార్లమెంటరీ వ్యవస్థకు, అమెరికా రాజ్యాంగం, ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసింది.. నిజమే కానీ అది పాశ్చాత్య దేశాల వరకే.. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు మనమూ వారిని వ్యామోహంలో పడి మాగ్నాకార్టా భజన చేస్తున్నాం.. మన అర్థశాస్త్రాన్ని మరచిపోతున్నాం..
పాశ్చాత్యులకు ప్రజాస్వామ్యం పురుడు పోసుకొని 800 ఏళ్లయింది.. కానీ మనకు 2000 ఏళ్ల క్రితమే ఈ వ్యవస్థ ఉంది.. చాణక్యుని అర్థశాస్త్రం చదవండి తెలుస్తుంది.. రాజ్యం ఎలా ఉండాలి.. పాలకుడు, పౌరుల విధులు, సమాజం, ఆర్థిక వ్యవస్థ ఎలా నడవాలి.. ప్రజాసంక్షేమం, పొరుగుదేశాలతో సంబంధాలు.. యుద్దాలు, శిక్షలు.. ఇలా ఎన్నో విషయాలను తెలియజేస్తుంది అర్థశాస్త్రం. రాజ్యం(సమాజం)లో ఎవరి విధి ఏమిటి అనేది స్పష్టపరచిన గ్రంథమిది.. మనం చెప్పుకుంటున్న ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలు అర్ధశాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తాయి.. గొప్ప రాజనీతిజ్ఞుడైన చాణక్యున్ని పాశ్యాత్యులు ఏనాడో గుర్తించారు.. చాణ్యక్య నీతి సూత్రాలను అధ్యయనం చేశారు.. కానీ మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు చాలా జాగ్రత్తగా అది మనకు అందకుండా చేశారు..

మన మెకాలే మనస పుత్రుల కారణంగా చాణక్యుని అర్థశాస్త్రం గురుంచి మనకు పెద్దగా తెలియకుండా పోయింది.. మన చరిత్ర పాఠాల్లో కౌటిల్యుని గురుంచి వీలైనంత తక్కువే చెబుతారు.. అయినా మనకు చాణక్యుని అర్థశాస్త్రం అందుబాటులోనే ఉంది.. వీలు చేసుకొని చదవండి..

No comments:

Post a Comment