ఏడాది క్రితం రాష్ట్ర విభజనకు ముందే సార్వత్రిక
ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఏర్పడే తెలంగాణలో తెరాసకు, ఆంధ్రప్రదేశ్లో తెదేపాకు
అధికారం అప్పగించారు ప్రజలు.. దాదాపు పుష్కర కాలంగా ఇరు ప్రాంతాల మధ్య
కొనసాగుతున్న ఘర్షణ ముగిసిపోయిందని, ఇక ఎవరి సంసారం వారిదే అని అంతా అనుకున్నారు..
విభజన సమయంలో ఏర్పడ్డ చిక్కుముళ్లు కూడా క్రమంగా తొలిగిపోతున్న సమయంలో కొత్త
గిల్లి కజ్జాలు వచ్చిపడ్డాయి. రెండు రాష్ట్రాల్లో ఈ ఏడాది కాలంలో పాలక పార్టీలు
కోతలు తప్ప పెద్దగా చేసిందేమీ లేదు.. ప్రతిపక్షాలు వారిపై పోరాటానికి సిద్దమౌతున్న
వేళ, ప్రజల దృష్టి మరల్చడానికా అన్నట్లు రెండు ప్రభుత్వాలు కొత్త ఎత్తుగడకు
దిగాయి..
ఓటుకు నోటు అంశం వీరికో సాకుగా దొరికింది..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ మైండ్ గేమ్
అడుతున్నాయి.. తమ రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ
వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.. ఈ యుద్దంలో ఓడేది, గెలిచేసి ఎవరైనా దుష్పభావ
ఫలితం అనుభవించేది మాత్రం తెలుగు ప్రజలే.. చేసిన నిర్వాకం చాలు.. ఇప్పటికైనా ఈ
లొల్లి ఆపేసి, ఎవరి ఇళ్లు వారు చక్కదిద్దుకుంటే మేలు..
No comments:
Post a Comment