Sunday, June 28, 2015

ఎమర్జెన్సీ.. బీజేపీ మహా ప్రస్థానం

స్వతంత్ర భారత చరిత్రలో విషాద ఘట్టం ఎమర్జెన్సీ.. ప్రధాని ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేసి, దేశాన్ని రాత్రికి రాత్రి జైలు పాలు చేశారు. ఇందిర నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో కీలక పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్, జనసంఘ్(బీజేపీ) కార్యకర్తలే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, దేశం కోసం త్యాగాలు చేశారు.. జనసంఘ్ పేరు బీజేపీగా మారింది ఎమర్జెన్సీ పుణ్యమే..
1952లో ప్రారంభమైన భారతీయ జన సంఘ్ జాతీయవాద రాజకీయాలకు కేంద్రం మారింది.. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ స్వభావం, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరు సాగించింది. దేశ సమగ్రత కోసం ఆ పార్టీ అగ్రనేతలు శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన దయాళ్ ఉపాధ్యాయ తమ ప్రాణాలు కోల్పోయారు. నెహ్రూ అనంతంరం ఇందిర దేశ ప్రధాని అయిన తర్వాత ఆమెను ధీటుగా ఎదుర్కొన్నది జనసంఘ్.. 1975లో ఇందిరా గాంధీ తమ పదవిని కాపాడుకునేందుకు అత్యవసర పరిస్థితి విధించి ప్రతిపక్ష నాయకులకు జైలుకు పంపారు. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అడ్వానీ తదితర అగ్ర జనసంఘ్ నేతలను చెరసాలతో పెట్టారు.. 
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడి ఇందిరాగాంధీని ఎదుర్కోవాలని ప్రతిపాదించారు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్.. దేశ భవిష్యత్తు కోసం ఇందుకు అంగీకరించింది జనసంఘ్, కొత్తగా ఏర్పడిన జనతా పార్టీలో వినీమైంది.. 1977 లోక్ సభ ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఆ పార్టీకి 295 సీట్లు రాగా అందులో 93 సీట్లు జనసంఘీయులే గెలిచారు. మిగతా వారిలో 71 మంది లోక్ దళ్, 44 మంది కాంగ్రెస్(ఓ), 28 మంది సోషలిస్ట్, సీఎఫ్ఓ సభ్యులున్నారు. న్యాయంగా ప్రధానమంత్రి పదవి జనసంఘీయులకే దక్కాలి.. కానీ పదవులకన్నా ప్రజాస్వామ్య పరిరక్షణకే ప్రాధాన్యత ఇచ్చారు వారు.. మురార్జీ దేశాయి ప్రధానిగా ఏర్పడిన జనతా ప్రభుత్వంలో అటల్జీ విదేశాంగ మంత్రిగా, అడ్వానీ సమాచార శాఖ మంత్రిగా పని చేశారు..భిన్న రాజకీయ పార్టీలు, సిద్దాంతాల స్వరూపమైన జనతా పార్టీలో నాయకుల అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగకుండానే పతనమైంది.. లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. జనసంఘీయులు మాత్రం క్రమశిక్షణ, సైద్దాంతిక నిబద్దతను కాపాడుకుంటూ వచ్చారు.. దీంతో ఇతర నాయకులు వీరిని చూసి ఆందోళనకు గురయ్యారు. జనసంఘీయులు ఆర్ఎస్ఎస్ తో అనుబంధాన్ని వదులుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు వారు అంగీకరించలేదు.. దీంతో ద్వంద్వ సభ్యత్వాన్ని సాకుగా చూపి జనసంఘ్ నాయకులను జనతా పార్టీ నుండి బహిష్కరించారు.
జనతా పార్టీ నుండి బయటనకు రావడం స్వేచ్ఛగా భావించారు జనసంఘీయులు.. తమదైన సైద్దాంతిక దృక్పధాన్ని కొనసాగిస్తూ 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేశారు. జనతా పరివార్ ముక్కలు చెక్కలైపోయినా బీజేపీ భారత రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిందంటే, ఇందుకు కారణం సైద్దాంతిక నిబద్దతే.. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అడ్వానీల నాయకత్వం, ఎందరో కార్యకర్తల త్యాగం, కృషి వృధా పోలేదు.. అటల్జీ, నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రులు అయ్యారంటే ఎందరో త్యాగధనుల ఫలితమే
..('చీకటి రోజులకు 40 ఏళ్లు' కథనానికి కొనసాగింపు)

No comments:

Post a Comment