యముడి నిరంకుశ పాలన వద్దు, ‘యమ
అర్జెన్సీ’ ఇకపై రద్దు .. యమగోల
చిత్రం పాటలోని చరణం ఇది.. నరక లోకంలో యమ ధర్మరాజుపై యమ భటులతో తిరుగుబాటు
చేయిస్తాడు సత్యం (ఎన్టీఆర్).. ఆ సందర్భంగా పాడిన ‘సమరానికి
నేడే ప్రారంభం’ పాటలో ఎమర్జెన్సీని ప్రస్థావించారు.. ఇందిరా
గాంధీ దేశంపై ఎమర్జెన్సీని రుద్ది..ప్రతిపక్షాన్ని, ప్రజలను
అష్టకష్టాలపాలుజేశారు.. ఈ నేపథ్యాన్ని ఈ పాటలో గుర్తు చేశారు ఎన్టీఆర్..
1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకూ
ఎమెర్జెన్సీ అమల్లో ఉంది.. అదే సంవత్సరం అక్టోబర్ 21న యమగోల విడుదలైంది.. సమరానికి
నేడే ప్రారంభం పాటను శ్రీశ్రీ రాశారు. ఈ గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా,
చక్రవర్తి సంగీతాన్ని అందించారు.. ఈ చిత్రంలో కార్మిక సంఘాల పడిగట్టు భాష ‘కాబట్టి
కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే..’ ‘ఏమి
లేదు..’ అంటు హాస్యాన్ని పండించారు ఎన్టీఆర్..
ఎమర్జెన్సీ విధించి 40 ఎళ్లు పూర్తయిన నేపథ్యంలో యమగోల గుర్తుకు వస్తోంది..
No comments:
Post a Comment