Monday, June 29, 2015

ప్రధాని, విపక్ష నేతల సంబంధాలు ఎలా ఉండాలంటే..

పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి.. ఒకరు దేశ ప్రధానమంత్రి, మరొకరు ప్రతిపక్షనేత.. ఇద్దరూ ఇద్దరే.. రాజకీయ దురంధరులు, సాహితీ వేత్తలు.. ఇద్దరివీ వేర్వేరు రాజకీయ సిద్దాంతాలు..
పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకునిగా ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ఎలా నిలదీయాలో, ఎక్కడ ఇబ్బంది పెట్టాలో చూపించారు అటల్జీ.. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం పలు అంశాల్లో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందించారు. ప్రధాని పీవీ సైతం అంతే హుందాగా ప్రతిపక్ష నేతను గౌరవించారు. ఐక్యరాజ్య సమతికి దేశం తరపున వెళ్లే బృందానికి విపక్ష నేత వాజపేయి నేతృత్వం వహించారు. పాకిస్తాన్ విధానాలను ఎండగట్టారు.. చట్టసభల్లో తన వాగ్దాటితో నిర్మాణాత్మ విమర్శలతో పాటు అధికార పక్షానికి సలహాలు అందజేసేవారు వాజపేయి.. ఈ కారణం వల్లే ఆయన్నిఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వరించింది.
అటల్జీ ప్రధాని అయిన తర్వాత పీవీ సైతం ప్రతిపక్ష నేతగా ఉన్నా, అమ్మోరు సోనియా ఆగ్రహం వల్ల ఎక్కువ కాలం ఆ హోదా దక్కలేదు. రాజకీయంగా ఎన్నో అంశాల్లో అటల్జీ, పీవీ సంఘర్షించుకున్నా వ్యక్తిగతంగా మంచి మిత్రులు.. ఇద్దరినీ కలిపింది సాహిత్యం. బహుభాషా కోవిధుడైన నరసింహారావు, వాజపేయి కవిత్వాన్ని చాలా ఇష్టపడేవారు.. పీవీ నరసింహా రావు రాసిన తన జీవిత కథ ఇన్ సైడర్ను ప్రధానమంత్రి హోదాలో ఆవిష్కరించారు అటల్జీ..

ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతల సంబంధాలు ఎలా ఉండాలో ఆచరణలో చూపించారు పీవీ, అటల్జీలు.. ఇలాంటి మహానేతలను, వారు అనుసరించిన విధానాలను ఈనాటి పరిస్థితుల్లో ఊహించుకోగలమా?

No comments:

Post a Comment