Saturday, June 6, 2015

ఢిల్లీ మన దేశంలో లేదా?

అరవింద్ కేజ్రీవాల్ తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీ, భారత దేశంలో లేదనుకుంటున్నాడు.. దేశ ప్రజలంతా నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఢిల్లీ ప్రజలు ఆప్ కు పట్టం కట్టారని అంటాడు. అందువల్ల ఎవరి పాలన వారు చూసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నాడు.. లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడింటికి ఏడు సీట్లు బీజేపీ గెలుచుకున్న సంగతి మరచిపోతున్నాడు. ఢిల్లీ మన దేశానికి రాజధాని.. స్థానిక పాలన కోసం అసెంబ్లీ హోదా ఇచ్చినా, కీలకమైన అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి.. భద్రతాకారణాల వల్ల పోలీసు శాఖను రాష్ట్రానికి బదిలీ చేయలేకపోతున్నారు..
సాధారణంగా కేంద్ర, రాష్ట్రాల చక్కని సమన్వయం ఉంటే ఎక్కడా ఘర్షణ తలెత్తే అవకాశం ఉండదు.. కానీ పేచీ కోరు మనస్థత్వం ఉంటేనే పెద్ద సమస్య.. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ధర్నాకు దిగిన ఘనత కేజ్రీవాల్ ది.. రిపబ్లిక్ డే వేడుకలు అవసరం లేదంటాడు. ఆప్ వారికి కాశ్మీర్ వేర్పాటు వాదులను సమర్ధించిన చరిత్ర ఉంది.. అలాగే ఆ పార్టీ వెబ్ సైట్ లో కశ్మీర్ ను భారత్ లో చూపించలేదు. విమర్షలు రావడంతో దాన్ని ఎత్తేశారు..

తనకు భారత దేశంలో సంబంధంలేదు, ఢిల్లీ తప్ప దేశం ఏమైపోతే నాకేమిటని కేజ్రీవాల్ అనుకుంటున్నారా?.. మోదీ పాలన నుండి ఢిల్లీని మినహాయించాలని ఆయన కోరుకోవడంలోని సంతకేతం ఏమిటి? కేజ్రీవాల్ వైఖరిని మనం సమర్ధించవచ్చా? 

No comments:

Post a Comment