Sunday, January 4, 2015

బ్రిటిష్ వాళ్లూ, నిజాములూ మంచోళ్లా?

కొమురం భీంను నిజాం చంపలేదు అంటూ సెలవిచ్చారు తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి..
అవునవును అల్లూరి సీతారామరాజును చంపించింది కూడా కింగ్ జార్జ్ చక్రవర్తి కాదు.. నిజాము తప్పు చేయలేదు, జార్జ్ చక్రవర్తి కూడా తప్పు చేయలేదు.. ఇద్దరూ మంచోళ్లే, గొప్పేళ్లే.. కానీ అసఫ్ జాహీ పాలనకు, బ్రిటిష్ పాలనకూ వ్యతిరేకంగా పోరాడిన వారే దుర్మార్గులు, పిచ్చోళ్లూ.. ఇలా కొత్త చరిత్ర రాసేద్దామా?.. ఆగస్టు 15, 1947, సెప్టెంబర్ 17, 1948 తేదీలను చరిత్రలోంచి చరిపేద్దామా?
ఏ రాజైనా, చక్రవర్తి అయినా తమ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిని నేరుగా చంపరు.. వారి ఆదేశాల ప్రకారమే శిక్షలు అమలవుతాయి.. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులు యోధులుగా కీర్తించబడుతున్నారంటే ప్రజల హక్కులను కాలరాసే నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడటం వల్లే..

నిరంకుశ ప్రభువులను కీర్తించడం బానిసత్వానికి, దేశ ద్రోహానికి చిహ్నం కాదా?.. సమర యోధుల త్యాగాలు, బలిదానాలను కించపరచడం కాదా?.. అధికారం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అమరుల ఆత్మలను క్షోభ పెట్టడం సమంజసమేనా?

No comments:

Post a Comment