Friday, January 30, 2015

తమశీల్దారుకు షాకిచ్చిన రైతన్న

'మరీ ఇంత అన్యాయమా?.. అసలు ఈ లోకంలో నీతి, నిజాయితీలు లేకుండా పోయాయి..' ఒకటే రొదపెట్టేస్తున్నాడు నా మిత్రుడు.
'ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి..' ఆయన మాటలకు అడ్డు పడ్డాను.
'ఛీ వాడు అన్నమే తింటున్నాడా?.. అసలు మనిషేనా వాడు..' తన దండకం ఆపలేదు మన మిత్రుడు.
'విషయం ఏమిటో సూటిగా చెప్పు..' కాస్త గట్టిగానే అడిగేశాను.
'చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది.. అయినా నీకు కాబట్టి చెప్పేస్తున్నా.. మొన్నొక రైతు తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులో అన్నీ దొంగ నోట్లే ఉన్నాయి..' గొల్లుమంటూ చెప్పుకొచ్చాడు మనోడు..
'అయ్యయ్యో.. నిజంగానే ఇది అన్యాయం.. అంతే కాదు దేశ ద్రోహం కూడా.. ఇంతకీ ఆ రైతు ఆ డబ్బులు ఎందుకు ఇచ్చాడు?..' ఊరడిస్తూ అడిగాను.
'పట్టాదారు పాసు పుస్తకం కోసం ఇచ్చిన డబ్బు అది..' నిజం కక్కేసి నాలిక కరుచుకున్నాడు మన తహశీల్దారు మిత్రుడు..
అవాక్కవ్వడం నా వంతైంది.. రైతు మిత్రమా.. మీకు పొర్లు దండాలు..

No comments:

Post a Comment