Wednesday, January 7, 2015

శశి థరూర్ పాపం పండుతోంది..

భార్యా భర్తలు గొడవ పడ్డారు.. అనుమానాస్పద పరిస్థితుల్లో భార్య మరణించింది.. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. మన దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా జరిగే పరిణామం ఇది.. కానీ గత ఏడాది జనవరి 17న ఢిల్లీలో జరిగిన ఒక ఘటనలో ఇందుకు భిన్నంగా జరిగింది.. కారణం భర్త కేంద్ర మంత్రి..
తన భర్తకు పాకిస్తానీ జర్నలిస్టుతో వివాహేతర సంబంధాలున్నాయని, ఆమె ఐఎస్ఐ ఏజెంట్ అని ట్విట్టర్లో ఆరోపించింది సునందా పుష్కర్.. అలాంటిదీ లేదని వాదించాడు శశి థరూర్.. చివరకూ ఇద్దరూ రాజీ పడి మీడియా ముందుకు వచ్చారు.. మరునాడే ఢిల్లోని ఓ స్టార్ హోటల్ గదిలో ఆమె శవమై తేలింది.. ఏడాది తర్వాత సునందను విష ప్రయోగం ద్వారా హత్య చేశారని వచ్చిన ఫోరెన్సిక్ నివేదికను వెల్లడించారు పోలీసులు..
సునంద పుష్కర్ ఓ సైనికాధికారి కూతురు.. కాశ్మీర్లో తీవ్రవాద కార్యలాపాలు పెరగడంతో జమ్మూకి వలస వచ్చిన పండిట్ల కుటుంబానికి చెందిన యువతి.. జీవితంలో కష్టపడి వ్యాపారవేత్తగా రాణించారు.. శశిథరూర్ తో పరిచయం, క్రికెట్ ఫ్రాంచైజీ వ్యవహారంలో ఆయన మంత్రి పదవి పోవడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది..  చివరకు ఇద్దరూ వివాహం చేసుకున్నారు.. కానీ ఆమె కాపురం కొన్నాళ్లైనా నిలవకుండా, అర్ధంతరంగా జీవితం ముగిసింది..

నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే శశిథరూర్ కేంద్ర మంత్రి హోదాలో చట్టం భారి నుండి తాత్కాలికంగా తప్పించుకున్నాడు.. కానీ ఇప్పుడేం జరగబోతోంది? వేచి చూడాలి.. ఆయనపై వచ్చిన ఆరోపణలు సామాన్యమైనవి కాదు.. ఒక వైపు భార్య మరణం కేసులో నిందితుడిగా కనిపిస్తున్నాడు.. కానీ సునంద చేసిన ఆరోపణలపై కూడా దృష్టి సారిస్తే దేశ ద్రోహం కేసు కూడా కనిపిస్తుంది.. 

No comments:

Post a Comment