Monday, January 5, 2015

ఉగ్రవాదంపై కాంగ్రెస్ వైఖరి మారదా?

ప్రపంచాన్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్య ఉగ్రవాదం.. ముఖ్యంగా భారత దేశానికి ఇది అతిపెద్ద ముప్పుగా మారింది... ముంబై, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరులాంటి ఎన్నో నగరాల్లో ఉగ్రవాదులు తమ దుశ్చర్యతో భారతీయుల ప్రాణాలు తీసుకున్నారు.. మన దేశ అస్థిత్వాన్ని ప్రమాదంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదంపై ప్రభుత్వంతో పాటు అన్న రాజకీయ పార్టీలు, పౌర సమాజం ఏకతాటిపై నిలవాల్సిన సమయం ఇది.. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసే మనస్థత్వాన్ని పెంపొందించిన కాంగ్రెస్ పార్టీ, మరోసారి తన నీఛ వైఖరిని చాటుకుంది..
ముంబై 26/11 మారణకాండ తర్వాత మన నిఘా, రక్షణ దళాలు సముద్రం తీర రక్షణపై నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాయి.. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేళ అరేబియా సముద్రంలో పోరుబందర్ రేవు పట్టణ సమీపంలో ఓ అనుమానిత మర పడవ కలకలం రేపింది ను మన భద్రతా దళాలు దాన్ని చుట్టుముట్టేలోపు అందులోని వారు తమను తాము పేల్చేసుకున్నారు.. మరో పడవ పాకిస్తాన్ వైపు పారిపోయింది.. ఎప్పటిలాగే పాకిస్తాన్ ఆ పడవలతో తమకు సంభందంలేదని బొంకింది. ఈ ఘటనపై దేశ వ్యాప్త చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాకిస్తాన్ వాదనను సమర్ధించే రీతితో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
ముంబైలో 26/11 సంఘటనలో పాకిస్తానీ పౌరుడు కసబ్ పట్టుబడిన తర్వాత కూడా, ఆ దేశం తమకు సంబంధంలేదని వాదించింది. విచారణలో పాకిస్తానీల ప్రమేయంపై ఆధారాలు స్పష్టంగా బయటపడ్డాయి.. ఆనాటి దాడి తర్వాత సోనియా, రాహుల్ సమక్షంలో నాటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కాషాయ ఉగ్రవాదం అంటూ అవాకులు చెవాకులు పేలి నాలిక కరచుకున్న సంగతి తెలిసిందే.. కసబ్ తో పాటు, పార్లమెంట్ పై దాడి కేసు నేరగాడు అఫ్జల్ గురులకు ఉరిశిక్ష పడినా చాలా కాలం పాటు శిక్షను అమలు చేయకుండా ఇంటి అల్లుళ్లలా చూసుకున్న ఘనతను మూట గట్టుకుంది కాంగ్రెస్.. చివరకు విమర్షలకు జడిసి శిక్ష అమలు చేయక తప్పలేదు.. ఢిల్లీ బాట్లా హౌస్ దాడి ఘటనలో ఉగ్రవాదులు మరణిస్తే సోనియా గాంధీ కన్నీరు కార్చారని స్వయంగా ఆ పార్టీ నేత సాల్మాన్ ఖుర్షీదే వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వంపై కోపం ఉంటే ఉండొచ్చు కానీ దేశ నిఘా, రక్షణ విభాగాలను నైతిక సామర్ధ్యాన్ని అగౌరవ పరిచే హక్కు ఎవరు ఇచ్చారు? దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ అసమర్ధత కారణంగానే ఈ రోజున ఉగ్రవాదం వివిధ రూపాల్లో వెర్రి తలలు వేస్తోంది.. ఉగ్రవాదాన్ని అరికట్టడం చేతగాక, మెజారిటీ ప్రజలను మనోభావాలతో ఆడుకున్న కారణంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పరాజయాన్ని మూట కట్టుకుంది.. ఈ విషయాన్ని ఆంటోనీ, దిగ్విజయ్ లాంటి నాయకులే ఒప్పుకున్నారు. అయినా కుక్కతోక వంకర చందాన కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకోకుండా దేశ ప్రజలచే మరోసారి ఛీ కొట్టించుకుంటోంది.

No comments:

Post a Comment