Wednesday, January 28, 2015

జమ్మూ కశ్మీర్ సమస్యను అర్ధం చేసుకోండి..

‘’జమ్మూ కశ్మీర్ సమస్య ఈ దేశ ప్రజలందరిదీ.. శరీరంలో ఏ భాగానికి హాని కలిగినా మొత్తం దేహంపై ప్రభావం చూపినట్లే కశ్మీర్ సమస్య కూడా దేశ భద్రతను ప్రభావితం చేస్తుంది.. భారత దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విలీనం విషయంలో ఎలాంటి సమస్య లేదు.. ఇది కేవలం బ్రిటిష్ వారి కుట్రకు తోడు ఢిల్లీ కేంద్రంగా సృష్టించిన సమస్యే.. జమ్మూ కశ్మీర్ సమస్యకు మూలం సరైన సమాచారం అందుబాటులో లేకపోవడమే.. ఇందుకు ప్రధాన బాధ్యత రాజకీయ నాయకులకన్నా విద్యావంతులు, మీడియాదే.. భారత్ లోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే కశ్మీర్ దేశంలో సంపూర్ణ అంతర్ భాగం.. ఈ విషయంలో దేశ ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.. జమ్మూ కశ్మీర్ గురుంచి ముందుగా తెలుసుకోండి, అర్థం చేసుకోండి, కలుపుకోండి.. ఈ దిశగా మనందరం పని చేద్దాం..’’
జమ్మూ కశ్మీర్:నిజానిజాలు
అనే అంశంపై ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో జనవరి 24,25 తేదీల్లో జాతీయ సదస్సు జరిగింది.. ఈ సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు జమ్మూ కశ్మీర్ అధ్యయన కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్ జీ ఇచ్చిన సందేశం ఇది..

No comments:

Post a Comment