Tuesday, January 27, 2015

సామాన్యునికి మరణం లేదు..

నేను ఎంతో అభిమానించే కార్టూనిస్ట్ ఆర్.కే.లక్ష్మణ్.. ఆయన సృష్టించిన సామాన్యుని పాత్ర కూడా అంతే ఇష్టం.. చాలా కాలంగా లక్ష్మణ్ అనారోగ్యంతో బాధ పడుతూ కనుమూయడం బాధాకరమే.. కానీ పుట్టిన ప్రతి వ్యక్తికీ మరణం తప్పదు అని గుర్తు తెచ్చుకోక తప్పదు.. ఆర్.కే.లక్ష్మణ్ లేకపోవచ్చు.. కానీ ఆయన సృష్టించిన సామాన్యుని పాత్రకు మరణం లేదు..ఈ సామాన్యుడు ఆరు దశాబ్దాలుగా మౌనంగానే ఉన్నాడు.. మౌనంగానే సమాజానికి చురకలంటిస్తూ వచ్చాడు.. సామాన్యుడు కొత్తగా కనిపించకపోవచ్చు కానీ ఆయన సంపుటాల్లో నిక్షిప్తమైన సామాన్యుని చిత్రాలు ఎప్పటికీ పలకరిస్తూ ఉంటాయి.. రేఖా విన్యాసాల్లో.. ఎందరో చిత్రకారులకు, కార్టూనిస్టులకు ఆర్కే లక్ష్మణ్ రేఖలు భగవద్గీత మాదిరే పవిత్రమైనవి..వారిని నేను నిరంతరం స్మరించుకుంటూనే ఉంటాను.. 

No comments:

Post a Comment