Tuesday, January 6, 2015

పుట్టుకతో అందరూ ముస్లింలే.. జోక్ అదిరింది కదూ?..

2015లో నేను విన్న తొలి జోక్స్ ఇవే.. పుట్టుకతో అందరూ ముస్లింలేనట.. ఇతర మతాలవారు ఇస్లాంను ఆశ్రయించడమే ఘర్ వాపసీ అట.. ఈ దేశం వారి తాత ముత్తాల గడ్డ అట.. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేల్చిన జోక్స్ ఇవి..  ఈ నయా సిద్దాంత కర్తకు ఏదైనా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సన్మానిస్తే బాగుంటుంది.. మహ్మద్ ప్రవక్త స్థాపించన ఇస్లాం మతం పుట్టింది ఏడో శతాబ్దంలో.. ఇస్లాం దండయాత్రల రూపంలో భారత దేశంలో ప్రవేశించింది ఎనిమిదో శతాబ్దం నుండే.. కానీ భారత దేశాని ఐదు వేల సంవత్సరాలకు పైగా ప్రాచీన వారసత్వం చరిత్ర ఉంది.. సనాతన ధర్మం (హిందూ), బౌద్ధ, జైన ధర్మాలు కూడా ఇస్లాం రాకకు ముందే ఈ దేశంలో ఉన్నాయి.. ఇస్లాం ఏ విధంగా మన దేశంలో ప్రవేశించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరి ఏవిధంగా ఈ దేశం వారి తాత గారి ఆస్తి అయిందో, పుట్టకతో అందరూ ఎలా ముస్లింలు అవుతారో ఓవైసీ సెలవిస్తే బాగుంటుంది..
హిందూ దేవతలపై నోరు పారేసుకొని, అరెస్టయి ఇంకా విచారణ ఎదుర్కొంటున్న అక్బరుద్దీన్ లో పోలిస్తే ఆయన అన్న బారిస్టర్ అసద్ కాస్త మంచివాడని, మేధావని కొందరు జర్నలిస్టు మిత్రులు అంటూ ఉంటారు.. ఈ పాటికి వారి భ్రమలు తొలిగే ఉండాలి.. మజ్లిస్ పార్టీ చరిత్ర, హైదరాబాద్లో ఆ పార్టీ ఎదిగిన క్రమం పరిశీలించన వారికి ఓవైసీలు ఏమిటో తెలుసు.. 

అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు, ఆయన వాదన చాలా పేలవంగా ఉంది.. వీటిని పట్టించు కోవాల్సిన అవసరమే లేదు.. జస్ట్ నవ్వుకొని వదిలేయాలన్నది నా వ్యక్తి గత అభిప్రాయం..

No comments:

Post a Comment