Tuesday, June 3, 2014

పాపం సత్తా లేదుగా..

పాపం సోనియా గాంధీ, రాహుల్ గాందీలకు ధైర్యం చాలడం లేదు..తాము వేస్ట్ అని మరోసారి చాటి చెప్పుకున్నారు..
యుపీఏ1,2 ప్రభుత్వాల్లో ప్రధాని పదవి చేపట్టేందుకు తల్లీ కొడుకులు ఇష్టపడలేదు.. కారణాలు అందరికీ తెలుసు.. మన్మోహన్ సింగ్ గారికి ప్రధానిని చేసి రిమోట్ పాలనతో ఇళ్లు చక్కన పెట్టుకున్నారు.. వీరిని పాలనను ఛీ కొట్టిన దేశ ప్రజలు కనీసం ప్రతిపక్ష నేత పదవికి కూడా అనర్హులని తేల్చేశారు..
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కేడర్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పే ధైర్యం కూడా వారికి లేకుండా పోయింది.. అందుకే మల్లికార్జున ఖర్గేను లోక్ సభలో తన నాయకునిగా నియమించుకున్నారు..

No comments:

Post a Comment