Sunday, June 8, 2014

ఒకే పత్రిక.. రాష్ట్రానికో స్పెషల్

తెలుగు మీడియాలో ఆసక్తికరమైన పరిణామం..
ఇవాళ ఈనాడు సండే స్పెషల్ చూశారా?.. కవర్ పేజీ స్టోరీ ఏమిటి?.. ఏముంది కేసీఆర్ పై ఇచ్చారా కదా? అనుకుంటున్నారా?.. అయితే మీరు తెలంగాణ వాళ్లన్నమాట.. కాదే చంద్రబాబు గురుంచి రాశారు కదా? అంటున్నారా?.. అయితే మీరు కచ్చితంగా సీమాంధ్ర వారే..
ఈరోజు ఈనాడు దిన పత్రిక సండే స్పెషల్ రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇచ్చింది.. తెలంగాణ ఎడిషల్ కేసీఆర్ ముఖ చిత్రంతో, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చంద్రబాబు ముఖచిత్రంతో సండే స్పెషల్స్ అందించాయి.. కొద్ది నెలలుగా ఈనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లను పూర్తి వైవిధ్య స్థానిక వార్తలు, కథనాలను అందిస్తూ వస్తోంది.. అదే బాటలో సాక్షి కూడా నడుస్తోంది.. ఆంధ్రజ్యోతి పాక్షికంగా ఆ పని చేస్తోంది.. అయితే ఆదివారం అనుబంధాలు మాత్రం రెండు ప్రాంతాల్లో ఒకటే వస్తున్నాయి.. విచిత్రంగా ఈనాడు ఇవాళ రెండు ప్రాంతాలకు వేర్వేరు సండే స్పెషల్స్ ఇచ్చి ఆసక్తిని రేకెత్తించింది..

పత్రికలు తమ పాఠకుల ఆసక్తులకు అనుగుణంగా తమ వ్యాపార అవసరాల కోసం స్థానిక వార్తలకు ప్రాధాన్యత ఇస్తూ ఎడిషన్లు తీసుకురావడాన్ని తప్పు పట్టలేం.. కానీ అన్ని ప్రాంతాల వారు ఆసక్తిగా చూసే ఆదివారం అనుబంధాలను కూడా ఇలా తీసుకురావడంలోని ఔచిత్యం ఏమిటో నాకు అర్థం కాలేదు.. ఏం కేసీఆర్ జీవిత విశేషాలు సీమాంధ్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా?.. చంద్రబాబు గురుంచి తెలంగాణ ప్రజలకు ఇక అవసరం లేదా?.. ఆలోచించండి.. 

No comments:

Post a Comment