Wednesday, June 11, 2014

విషాద యాత్రగా మార్చకండి..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో హైదరాబాద్ విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన చాలా విచారాన్ని కలిగిస్తోంది.. ఆనందంగా ముగియాల్సిన విహారయాత్ర విషాదంగా మారింది.. ఇక్కడ మొదలి తప్పు హిమాచల్ ప్రభుత్వానికి.. రెండో తప్పు కాలేజీ యాజమాన్యానిది.. అయితే తప్పు ఎవరిది అని చర్చించుకోవడంకన్నా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తంకాకుండా చూసుకోవడం ముఖ్యం.. విద్యాసంస్థలు తమ విద్యార్థులను విహార యాత్రలకు పంపే సమయంలో అక్కడి పరిస్థితులు తెలిసిన వారిని గైడ్లుగా పంపాలి.. విద్యార్థులకు తోడుగా అధనపు సిబ్బందిని కూడా పంపాలి..అలాగే ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగానే చెప్పాలి.. ముందుగా బీమా చేయించడం తప్పని సరి.. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తగిన జాగ్రత్తలు ముందుగానే చెప్పాలి.. 

No comments:

Post a Comment