Thursday, June 26, 2014

30 రోజులు..

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు పూర్తయ్యింది.. మోదీ నెల రోజుల పాలన ఎలా ఉందని అడిగితే, చూసే వారి కోణాన్ని బట్టి జవాబు ఉంటుంది..
మోదీ సర్కారు రైలు చార్జీలు పెంచిందని, పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నియంత్రించడం లేదని ప్రతిపక్షాలు, ఆయనంటే గిట్టని వారు గగ్గోలు పెట్టేస్తున్నారు. నిజానికి ఇది ఎప్పుడూ ఉండే గోలే.. వారు నరేంద్ర మోదీని గతంలో విమర్శించారు.. ఇప్పుడూ విమర్శిస్తున్నారూ.. భవిష్యత్తులొ కూడా ఇలాగే ఏడుస్తూనే ఉంటారు.. మనం సద్విమర్శలనే స్వీకరిద్దాం..
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే, పొరుగు దేశాలతో సత్సంబంధాలకు నాంది పలికారు.. ప్రభుత్వ యంత్రాంగంలో బాధ్యత, జవాబుదారి తనం పెంచే దిశగా ప్రయత్నాలు చేపట్టారు.. ప్రతి ప్రభుత్వ విభాగాన్నీ ఆయతన  నిషితంగా పరిశీలిస్తున్నారు.. దశాబ్ద కాలంగా పేరుకుపొయిన యూపీఏ పాలన తాలూకు చెత్తను తొలగించాలంటే కొంత సమయం పడుతుంది. అయితే విమర్షకులు ఆగేట్టు లేరు.. బిడ్డ పుట్టగానే పరుగెత్తాలనే తొందర వారిది.. మోదీ ప్రధాని అయిన మరునాటి నుండే వారి దాడి మొదలైంది.. ఇలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటారా?
ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. నరేంద్ర మోదీ నెల రోజుల పాలనపై అత్యధిక శాతం ప్రజలు దేశ ప్రజలు సంత్రుప్తిని వ్యక్తం చేశారు.. గత ప్రధానులతో పొలిస్తే 69 శాతం ఉత్తమమని మార్కులిచ్చారు.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే సత్తా మోదీకే ఉందన్నారు.. ఇది చాలు నెల రోజుల పాలనపై జడ్జ్ చేసేందుకు..   

No comments:

Post a Comment