Tuesday, June 10, 2014

పాచి పట్టిన ఆధార్..

ఆధార్.. ఇది సామాన్యుని చేతిలో పాశుపతాస్త్రం అంటూ యూపీఏ సర్కారు హడావుడి చేసింది.. చివరకు పాచిపట్టిన అస్త్రం అని తేలిపోయింది..
ఆధార్ కార్డులను సమర్ధంగా ఉపయోగిస్తే ప్రయోజనాల మాట ఎలా ఉన్నా, గ్యాస్ సిలిండర్ల లింకేజీ కారణంగా దేశ ప్రజల వ్యతిరేకతకు కారణమైంది.. ఎంత వ్యతిరేకత అంటే ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకని కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు..
ఆధార్ కార్డులపై తప్పులు వస్తే ఎవరికి మొరపెట్టుకోవాలో, వాపసు ఇస్తే తిరిగి కొత్తది ఇస్తారా అనే అనుమానాలు ఉన్నాయి.. వాటిపై ఫోటోలు మబ్బుగా ఉండటంతో ధృవీకరణ పత్రాలుగా కూడా చెల్లడం లేదు..
అసలు విషయానికి వస్తే ఆధార్ కార్డు బాసు నీలేకని గారి పూర్తి పేరు నందర్ మనోహర్ నీలేకని.. అయితే ఆయన పేరు ఆధార్ కార్డుపై నందన్ మోహన్ నీలేకనిగా ముద్రితమైందట.. హతవిధి.. ఆధార్ బాసుకే దిక్కులేని స్థితిలో సామాన్యుని కష్టాలు ఎలా ఉంటాయో ప్రభుత్వాలకు అర్థమయ్యే ఉండాలి
(డా.సుబ్రహ్మణ్య స్వామి పోస్టుకు స్వల్ప మార్పులతో)

No comments:

Post a Comment