Sunday, June 15, 2014

తెలుగు తెగులు

పాఠశాలు మళ్లీ తెరిచారు.. చాలా మంది తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు తమ బుజ్జాయిలకు అక్షరాభ్యాసం కోసం సరస్వతీ దేవి కొలువైన బాసర తీసుకెళ్లడం ఆనవాయితీ.. సరస్వతీ మాత ఆలయంలో భారీ రద్దీ కనిపిస్తోంది.. అక్కడి అర్చకులు చిన్నారులకు మాత ఆశీస్సులతో అచ్చ తెలుగులోనే అక్షరాలు దిద్దిస్తున్నారు.. అంత వరకూ బాగానే ఉంది.. కానీ కొద్ది వారాల క్రితం నేను బాసర వెళ్లినప్పుడు ఒక విచిత్రమైన బోర్డు కనిపించింది.. ఆ బోర్గు మీద 'ప్రత్కేక' అక్షరాభ్యాసం 1000/- అని రాసి ఉంది.. సరస్వతి మాత కొలువులోనే తెలుగుకు తెగులు పట్టిందా అని బాధపడ్డాను.. అక్కడి ఓ అధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లితే లైట్ తీసుకోండి సార్ అని సలహా ఇచ్చాడు..
ఇటీవల FBలో మిత్రుడు శ్రీనివాస రావు అవ్వారు మరో విషయం ప్రస్తావించారు.. బాసరలో అక్షరాభ్యాసం కోసం అమ్ముతున్న పలకలపై ఆంగ్ల అక్షరాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.. పాపం తల్లిదండ్రుల ఎంగిలిపీసు మోజును వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.. కనీసం అక్షరాభ్యాస పలకలపై అయినా మాతృభాష లేకపోతే ఎలా? అనిపించింది.. అయితే ఒక వ్యాపారి చెప్పిందేమిటంటే బాసరకు తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, కన్నడ భాషల వారు కూడా వస్తున్నారట.. వారి కోసం ప్రత్యేకంగా పలకలు అమ్మలేం కదా అంటున్నారు.. ఇదీ నిజమే.. మన పలకలు మనం తీసుకొని పోవడమే తగిన పరిష్కారం అనిపించింది..

No comments:

Post a Comment