Friday, June 20, 2014

గవర్నర్లను మార్చొద్దా?

కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం తమకు విధేయంగా, అనుకూలంగా ఉండాలని కోరుకోవడం సహజం.. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, మరే కూటమి అధికారంలోకి వచ్చినా చేసే పనే.. గత ప్రభుత్వ వ్యవస్థను, రాజకీయ నియామకాలను కొనసాగించాలని కోరుకోవడం సమంజనం కాదు..
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఈ దిశగా ప్రక్షాళన ప్రారంభించారు.. అందులో భాగంగానే గతించిన యూపీఏ ప్రభుత్వం నియమించిన రాష్ట్రాల గవర్నర్లను తొలగిస్తున్నారు.. ఇంత మాత్రానికే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేస్తున్నాయి.. మరి కాంగ్రెస్ వారు 2004లో తాము చేసిన పనేమిటో మరిచిపోయారా? ఎన్డీఏ నియమించిన గవర్నర్లను తొలగించలేదా?.. మరి ఎందుకు గొంగట్లో వెంట్రుకలు ఏరుతున్నారు?
గవర్నర్లను మర్చే దుష్ట సాంప్రదాయం 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ప్రారంభించిందని అంటున్నారు.. నిజమే అప్పుడు తొలిసారిగా అధికారం చేపట్టిన కాంగ్రెసేతర ప్రభుత్వం ఆ పని చేపట్టడాన్ని ఎలా తప్పుపట్టగలం.. ఇప్పడు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు కోరుకుంటున్న ప్రకారం తాము నియమించిన గవర్నర్లనే కొనసాగించాలనే అనుకుందాం.. వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వారే ఉన్నారు.. అంటే ఎన్డీఏ సర్కారులో పరోక్షంగా తమ ఏజెంట్లు ఉండాలి.. పాలనకు ఆటంకాలు కలిగించాలి.. ఇదేనా ఆ పార్టీ కోరుకుంటున్నది.. కొత్త ప్రభుత్వానికి తమ వారిని, విధేయంగా ఉండేవారిని నియమించుకోవద్దు అని వాదించడం మూర్ఖత్వం కాదా?

నిజానికి గవర్నర్ల వ్యవస్థే గందరగోళం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానంగా ఉండేందుకు మన రాజ్యాంగవేత్తలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.. కానీ కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు దీన్ని రాజకీయ నిరుద్యోగులు, వృద్ధ నేతల పునరావాస కేంద్రంగా మార్చేశాయి.. చాలా రాష్ట్రాల్లో రాజ్ భవన్ లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, కుట్రలు కుంతంత్రాలకు కేంద్రాలకు మారడం చూస్తునే ఉన్నాం.. ఇలాంటి గవర్లర్ల వ్యవస్థ అవసరమా అనే అంశంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది.. మోదీ సర్కారు ఈ దిశగా ప్రక్షాళన చేపడితే చాలా బాగుంటుంది..

No comments:

Post a Comment