Tuesday, June 24, 2014

కాశ్మీర్ కోసం బలిదానం

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీని గుర్తు తెచ్చుకుందాం.. ఈ రోజు ఆ మహనీయుని బలిదాన దినం (23 జూన్ 1953)
జూలై 6, 1901న కలకత్తాలో అశుతోష్ ముఖర్జీ, జోగమయా దేవిలకు జన్మించారు శ్యామ ప్రసాద్.. తండ్రి అశుతోష్ ముఖర్జీ కలకత్తా విశ్వ విద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్..  ఎంఏ, బారిస్టర్ చేసిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ 1934లో 33 ఏళ్ల చిన్న వయసులోనే అదే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యి రికార్డు సృష్టించారు.. కాంగ్రెస్ పార్టీ తరపున అవిభక్త బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికైన శ్యామప్రసాద్జీ 1941లో ఆ రాష్ట్ర తొలి ఆర్ధిక మంత్రిగా పని చేశారు.. కాంగ్రెస్ విధానాలతో అసంతృప్తితో హిందూ మహాసభలో చేరారు.. ఆ సంస్థకు అధ్యక్షునిగా పని చేశారు.. బ్రిటిష్ వారు దేశ విభజన తలపెట్టినప్పుడు బెంగాల్ ను ఏకమొత్తంగా పాకిస్తాన్లో చేర్చేందుకు అభ్యంతరం చెప్పారు శ్యామప్రసాద్ ముఖర్జీ.. ఇవాళ పశ్చిమ బెంగాల్ భారత దేశంలోనే ఉందంటే అది ఆయన పోరాట ఫలితమే..
జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఏర్పాటైన స్వాతంత్ర భారత తొలి క్యాబినెట్లో శ్యామప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖమంత్రిగా పని చేశారు.. నెహ్రూ విధానాలతో విసుగొచ్చి 1950లో కేంద్ర మంత్రి పదవికి  రాజీనామా చేశారు.. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ గోల్వాల్కర్ (గురూజీ) చర్చించిన శామప్రసాద్ ముఖర్జీ 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారు ( కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా మారింది)
భారత దేశంలో సంపూర్ణంగా విలీనమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఉద్యమం ప్రారంభించారు.. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక జెండా, రాజ్యాంగం, ప్రధానమంత్రి ఉండటాన్ని ప్రశ్నించారు.. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదని గట్టిగా నినదించారు.. కాశ్మీర్ వెళ్లి నిరాహార దీక్ష తలపెట్టారు.. శ్యామప్రసాద్ ముఖర్జీ గుర్తింపు కార్డు లేకుండా కాశ్మీర్ లోకి ప్రవేశించారనే సాకుతో  షేక్ అబ్దుల్లా ప్రభుత్వం మే 11, 1953న ఆయనను అరెస్టు చేసింది.. కాశ్మీర్ జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో జూన్ 23న ప్రాణాలు కోల్పోయారు శ్యామ ప్రసాద్జీ.. ఆయన మరణంపై విచారణ జరిపించాలని జనసంఘ్ డిమాండ్ చేసినా ప్రధాని నెహ్రూ పట్టించుకోలేదు..  ముఖర్జీ మరణం నేటికీ అనుమానాస్పదంగా మిగిలింది..

కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ.. ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసిన నాడే ఆయనకు నిజమైన నివాళి.. ఇందు కోసం పోడాల్సిన బాధ్యత  ప్రతి భారతీయునిపై ఉంది..

No comments:

Post a Comment