Tuesday, June 3, 2014

పటేల్ గుర్తున్నారా?..

ఓ తెలంగాణ నాయకులారా.. ఉక్కుమనిషిని మరచిపోయారా?..
మనం ఈ రోజున స్వేచ్చా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామంటే అది ఎవరి పుణ్యం.. నిరంకుశ నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసి, భారత దేశంలో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ది కాదా?..
తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజున ఒక్కరైనా ఆయనను స్మరించుకున్నారా?.. శాసన సభ, ముందు అమర వీరుల స్మారక స్థూపానికి సమీపంలోనే పటేల్ విగ్రహం ఉంది.. కనీసం రెండడుగులు వేసి ఈ మహనీయునికి కూడా మొక్కితే మీ సొమ్మేం పోయింది.. వల్లభాయ్ పటేల్ హైదరాబాద్, తెలంగాణ చరిత్రలో భాగం కాదా?
పటేల్ గారిని స్మరిస్తే మీ రజాకార్ మిత్రులు కోపగించుకుంటారనే భయమా?.. ఛీ ఛీ కుహనా సెక్యులరిజమా వర్ధిల్లు..

No comments:

Post a Comment