Tuesday, June 3, 2014

ఇదీ సపా రాజ్యం..

'రేపిస్టులకు ఉరి శిక్ష వేయడం అన్యాయం..' కొద్ది వారాల క్రితం సమాజ్ వాదీ పార్టీ (సపా) అధినేత ములాయం సింగ్ యాదవ్ నోట ఈ మాట మీరు వినే ఉంటారు.. దేశమంతా ఈ వ్యాఖ్యను ఖండించినా నిర్లజ్జగా ఆయన సమర్థించుకున్నారు..
యధా రాజా.. తథా ప్రజ అంటారు..  ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిత్వం వెలగబెడుతున్న ఉత్తరప్రదేశ్ అనే అసాంఘిక శక్తుల, ఆటవిక రాజ్యంలో ఇద్దరు దళిత బాలికలను దారుణంగా అత్యాచారం చేసి, ఉరేసి చంపారు.. ఈ సంఘటపై దేశమంతా నిరసనలు వ్యక్తం అవుతున్నా ఈ తండ్రీ కొడుకుల్లో కనీసం చలనం లేదు..
ఛీ..ఛీ.. అసలు వీళ్లు మనుషులేనా?.. సపా పాలన సఫా అయ్యే రోజులు దగ్గరపడ్డాయి.

No comments:

Post a Comment