Thursday, June 27, 2013

వీర జవాన్లకు పాదాభివందనం..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతి పెద్ద యుద్దేతర సహాయక కార్యక్రమాల్లో భారత సైన్యం పాల్పంచుకుంటోంది.. ఉత్తరాంఖండ్ వరదల్లో చిచ్చుకున్న వేలాది మంది చార్ ధామ్ భక్తులను కాపాడుతోంది మన సైన్యం.. కొండా కోనల్లో చెల్లా చెదురైన యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకు రావడంతో పాటు ఆహారం, వసతి కల్పించి ఆదుకుంటున్నారు మన జవానులు.. తాత్కాలిక వంతెనలు నిర్మించి, తాళ్లతో నదులను దాటించి యాత్రికుల ప్రాణాలు కాపాడుతున్నారు.. అందుకోసం ప్రతికూల వాతావరణంలో ప్రాణాలకు తెగించి ప్రకృతితో పోరాటం చేస్తున్నారు.. సహాయక చర్యల్లో సైనికులు తమ సహచరులను సైతం కోల్పోయినా మనో ధైర్యం కోల్పోకుండా పని చేస్తున్నారు.. ప్రతికూల వాతావరణంలో ఓ హెలిక్యాప్టర్ కూలి వైమానిక దళ సభ్యుల ప్రాణాలు కూడా పోయాయి..

మన వీర జవానులకు సెల్యూట్ చేయడంతోనే సరిపెట్టుకోవద్దు.. వీలైతే పాదాభివందనం చేద్దాం..






No comments:

Post a Comment