Friday, June 28, 2013

జై జవాన్.. జై కిసాన్..

ఈ నినాదం వినగానే మనలో దేశభక్తి ఉప్పొంగుతుంది.. ఉత్తరాఖండ్ వరదల్లో మన సైనికుల సహాయక చర్యలను చూస్తుంటే మరోసారి ఈ నినాదం అందరి నోళ్లపై మెదులుతోంది..
1965లో లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ మన దేశంపై యుద్ధానికి దిగింది.. భారత సైనికులు పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు.. ప్రధమ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ముందు చూపు లోపం కారణంగా చైనా దాడిని సమర్థవంతంగా ఎదురుకోలేక పోయామనే బాధలో ఉన్న భారత ప్రజలకు, పాకిస్తాన్ పై సాధించిన తాజా విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.. భారత జవాన్లలో శాస్త్రీజీ నింపిన స్పూర్తి విజయానికి కారణమైంది..
మరోవైపు స్వాతంత్ర్యం తర్వాత తీవ్ర ఆహార ధాన్యాల కొరతతో బాధపడుతున్న మన దేశం హరిత విప్లవంతో స్వయం సంవృద్ధిని సాధించింది.. దేశంలో విస్తారంగా పంటలు పండాయి.. ఈ నేపథ్యంలోనే లాల్ బహద్దూర్ శాస్త్రి జై జవాన్.. జై కిసాన్.. నినాదం ఇచ్చారు.. దేశాన్ని రక్షించే సైనికులకు జై కొడదాం.. అలాగే మనం తిండిని ఇచ్చే రైతన్నకూ జై కొడదాం అని శాస్త్రీజీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు..
ఈ నినాదాంలో మరో జై జోడించారు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి.. 1999లో పోఖ్రాన్ అణు పరీక్ష విజయం సందర్భంగా వైజ్ఞానిక వేత్తల (శాస్త్రవేత్తల) సేవలను గుర్తిస్తూ జై విజ్ఞాన్ నినాదాన్ని కూడా చేర్చారు..
సైనికులకు, రైతులకు సైతం శాస్త్రవేత్తల సేవలు కావాలి.. ఈ ముగ్గరి సేవలు దేశ ప్రజలకు ఎంతో ముఖ్యం..
అలా జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్ .. నినాదం రూపు దిద్దుకుంది..



No comments:

Post a Comment