Tuesday, July 31, 2012

మనం ఎక్కే రైలు క్షేమమేనా?

ప్రపంచ రైల్వేలన్నీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంటే, భారతీయ రైల్వే ఇంకా ప్రమాదాల దశనే దాటలేదు.. నెల్లూరులో తమిళనాడు ఎక్స్ ప్రెస్ బోగీ అగ్నికీలలకు ఆహుతి కావడం అసలు రైలు ప్రయాణం ఎంత వరకు సురక్షితం అనే ప్రశ్నను రేకెత్తిస్తోంది.. రైల్ సేఫ్టీ కోసం బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 45 శాతం కూడా ఖర్చు చేయలేదట.. ప్రయాణీకుల భద్రతలో రైల్వే శాఖ చూపుతున్న అశ్రద్దకు ఇంతకన్నా ఉదాహరణ ఉంటుందా?.. గత, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలోని ప్రాంతీయ నేతలైన లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ రైల్వే మంత్రులుగా ఈ శాఖ పని తీరును భ్రష్టు పట్టించారు.. తమ రాష్ట్రాల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ, విస్తరణ, అభివృద్ధి, సురక్షిత అంశాలను నిర్వీర్యం చేశారన్నది సుస్పష్టం.. భారతీయ రైల్వే బిహారీ, బెంగాలీ బాబులకే పరిమితమా? ప్రాంతీయ ప్రయోజనాలకు అతీతంగా రైల్వే పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉంది..

No comments:

Post a Comment