Friday, July 20, 2012

ధృతరాష్ట్ర పుత్రులు

అసోం దుశ్శాసన పర్వం చూశాక కలిగిన బాధకన్నా, ఆ సంఘటనలో లైవ్ టీవీ రిపోర్టర్ ప్రమేయం ఉన్న విషయమే ఎక్కువ విచారం కలిగించింది.. కొద్ది సంవత్సరాల క్రితం ఒంగోలు కలెక్టరేట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్న ఓ వ్యక్తిని అడ్డుకోవాలనే ఆలోచన కూడా కలగని మానవత్వం లోపించిన ఛానెళ్ల ప్రతినిధులు అతడు చచ్చేదాకా తమ కెమెరాల్లో చిత్రీకరించారు.. మనం జర్నలిస్టులం అనే కొమ్ములు తగిలించుకునే ముందు, మనుష్యులం కూడా అని గుర్తుంచుకోవాలి.. ఇక అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించేవారి విషయానికి వస్తే ఇలాంటి ధృతరాష్ట్ర పుత్రులు తమకు కూడా సోదరీమణులు ఉన్నారనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.. తమ కుటుంబ సభ్యులతో ఇతరులు కూడా అలాగే ప్రవర్తిస్తే అనే స్పృహ వారికి కలగడం మంచిది.. వెర్రితలలు మేస్తున్న ప్రాశ్చాత్యీకరణకు అసోం సంఘటన పరాకాష్ట.. అర్ధరాత్రి దాకా పబ్బులు,క్లబ్బుల చుట్టూ పార్టీ పేరిట తిరిగే తమ పిల్లలను కట్టడి చేయలేని తల్లిదండ్రులు ఈ భూమిపై రాక్షస సంతతిని పెంచుతున్నామని ఇకనైనా గ్రహిస్తారా?

No comments:

Post a Comment