Saturday, July 14, 2012

‘గ్యాస్’ కబుర్లు

స్వర్ణాంధ్ర పాయే.. హరితాంధ్ర పోయే.. అంధాంధ్ర మిగిలే.. ప్రభుత్వాలు, పార్టీలు మారినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్తు సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది.. పారిశ్రామిక వేత్తలు, రైతులు, సామాన్యులు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు.. ప్రాజెక్టుల్లో నీరు లేక హైడల్ పవర్ తగ్గిందనుకుందాం.. కానీ అపారమైన బొగ్గు నిల్వలు, సహజ వాయువు ఉన్న ఏపీకి ఏమిటీ దుస్థితి.. విద్యుత్తు సంక్షోభానికి సహజవాయువు కొరతే కారణమని ముఖ్యమంత్రి గ్యాస్ కబుర్లు చెబుతాడు.. రిలయన్స్ కంపెనీని తిడతాడు.. రిలయన్స్ గ్యాస్ ఏమన్నా ఆకాశంలో ఉత్పత్తి చేస్తోందా? రాష్ట్ర భూభాగంలేనే కదా ఉన్నది.. ఆ కంపెనీని ఆ మాత్రం కంట్రోల్ చేయలేరా?.. కేంద్రంలో ఇతర పార్టీ ప్రభుత్వం ఉన్నట్లు ధీనంగా గ్యాస్ కోసం దేబిరించడం ఎందుకు? పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి ఏమైనా మన రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తా?.. రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్లు? కరెంటు సమస్య కూడా తీర్చలేని ఈ అసమర్థ పాలకులును ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను ఇంకా భరించాలా? వీరు ఉండి ఎందుకు? సిగ్గుతో బంగాళాఖాతంలో పడొచ్చుకదా?

No comments:

Post a Comment