Wednesday, July 25, 2012

సెటిమెంట్లతో ఆటలొద్దు

ఈ రెండు వార్తలు కలవర పరిచేవే.. ఒక దానితో ఒకటి సంబంధం లేనివే అయినా ఒక విషయంతో ముడిపడి ఉన్నాయి.. మొదటిది.. తిరుమలలో సాక్షాత్తు టీటీడీ ఉద్యోగులే అన్య మత ప్రచారం చేయడం. ఇందుకు కారకులైన ఉద్యోగులను బదిలీ చేయడం తప్ప విధించిన కఠిన శిక్ష ఏమిటి? కొన్ని సంవత్సరాల క్రితం నాటి ప్రభుత్వం ఏడు కొండలను రెండింటికే కుదించే కుట్ర పన్నింది.. పరమ భక్తుని ముసుగేసుకున్న ఓ నాస్తికుడు ఏకంగా టీడీడీ ఛైర్మన్ అయ్యాడు.. అతగాడు బ్రహ్మోత్సవాల సమయంలో ఏకంగా కొండపై శిలువ ఆకార స్థంబాలు నాటించే ప్రయత్నం చేయగా మీడియా బయట పెట్టింది.. పద్మావతి యూనివర్సిటీలో అప్పటి వైస్ ఛాన్సలర్ శ్రీవారి చిత్ర పటాలను తొలగించి క్రీస్తు ఫోటోలు పెట్టించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. గత కొన్నేళ్లుగా తిరుమల మెట్ల దారిలో, బస్సుల్లో యదేచ్ఛగా అన్యమత ప్రచారం జరుగుతున్న పట్టించుకునే నాధుడు లేడు.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి సన్నిధిలో ఏమిటీ దారుణం.. ఇతర మతస్తుల మనోభావాలతో ఇలాగే వ్యవహరిస్తే ఊరుకునే వారా? ఎన్ని గొడవలు జరిగేవి.. హిందువుల సహనశీలతను బలహీనతగా భావించే ఈ బరితెగింపా?

ఇక రెండో విషయానికి వద్దాం.. విజయమ్మ గారు సిరిసిల్ల వెళ్లింది చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికా? లేక మత ప్రచార కూటములకా? ఆమె చేతిలో ఉన్న మత గ్రంధం దేనికి సంకేతం? విజయమ్మకు ఏ మతమైనా అనుసరించే స్వేచ్ఛ ఉండొచ్చు.. ఈ విషయంలో కామెంట్ చేయడం తప్పే కావచ్చు.. ఒక ముఖ్యమైన ప్రజా సమస్యపై జరిగే ఆందోళనా కార్యక్రమంలో బైబిల్ చేత పట్టుకోవడం దేనికి సంకేతం? అక్కడ ఉన్నమెజారిటీ ప్రజల మనోభావాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా? మన దేశంలో ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్చ ఉంది.. కానీ ఆ స్వేచ్ఛకూ హద్దు ఉంటుంది.. ప్రజా జీవితంలో ఉన్న వారు అన్ని మతాల సెంటిమెంట్లను గౌరవించాలి..

No comments:

Post a Comment