Friday, July 6, 2012

పీవీపై పగెందుకు?

మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుపై చచ్చిన అర్జున్ సింగ్, ఇంకా బతికే ఉన్న కుల్దీప్ నయ్యర్ బురదజల్లలిన తీరు చూస్తుంటే వారు అసలు మనుషులేనా? అనే అనుమానం వచ్చింది.. సోకాల్డ్ గాంధీ కుటుంబానికి గులాంగిరీ చేయడంలో నడుములిరిగిపోయిన అర్జున్ సింగ్ చచ్చే ముందు అప్పటికే దివంగతులైన నరసింహారావుపై విషపు రాతలు రాసిన తీరు చూస్తుంటే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు పదిలంగా సాగాలని కోరుకున్న ఆరాటమే కనిపిస్తుంది.. సోనియా ప్రాపకం కోసం పీవీపై అర్జున్ మొదటి నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు.. 1992 డిసెంబర్ 6 నాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంటే పీవీ ఎంత వత్తిడిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. బాబ్రీ మసీదు కూలే సమయంలో ఆయన పూజలు చేస్తూ గడిపారని మరో దివంగత నేత మధు లిమాయే చెప్పాడని నయ్యరయ్య అంటున్నారు.. పీవీజీపై ఎందుకీ విషపు రాతలు? చచ్చి పైలోకాన ఉన్న నరసింహారావు, మధులిమాయే వివరణ ఇచ్చుకోగలరా? పీవీపై గుంట నక్కలాంటి అర్జున్ సింగ్ చేసిన విమర్శలను అర్థం చేసుకోవచ్చు.. కానీ కుల్దీప్ నయ్యర్ కు ఏమైనట్లు.. పాకిస్తాన్ భజనలో ఆరి తేరిన ఈయన గారికి ఆ దేశం మన దేశంలో చేసిన దాడులను ఖండించడంలో నోరు పెగలదు.. తెలంగాణ రాష్ట్రం ఒక అన్యాయమైన డిమాండ్ అంటాడు.. తొలి తెలుగు ప్రధాని పీవీపై ఇంత ఘోరమైన దాడి జరుగుతుంటే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఎందుకు ఖండించడంలేదో అర్థం కావడం లేదు.. ఢిల్లీ అమ్మోరు కన్నెర్ర చేస్తుందని భయమా?.. నోరు మెదపాల్సిన బాధ్యత పీవీ తనయుడు రంగారావు, పాలడుగు వెంకటరావు, రుద్రరాజు పద్మరాజులకే ఉందా?.. ఇందిర, రాజీవ్ ల జయంతి, వర్ధంతులను ఘనంగా చేసుకునే కాంగ్రెస్ నేతలు ఇటీవలే పీవీ విషయంతో ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? నరసింహారావు చనిపోయాక ఢిల్లీలో ఆరడగుల సమాధి స్థలం ఇచ్చేందుకు కూడా సోనియా గాంధీ ఒప్పుకోలేదు.. ఏఐసీసీ కార్యాలయం బయటి నుండే శవాన్ని హైదరాబాద్ పంపిన ఘనత ఆమెది.. దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసి అప్పుల ఊబి నుండి కాపాడిన నరసింహారావుకు ఇచ్చే నివాళి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నివాళి ఇదేనా? పీవీ పుణ్యమా అని ఆర్థిక మంత్రి అయ్యి, ఇప్పడు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా అమ్మగారికి జడిసి పీవీ పేరెత్తడంలేదు.. సోకాల్డ్ గాంధీ కుటుంబ సభ్యుడు కాకపోవడమే ఆయన చేసిన నేరమా?..

No comments:

Post a Comment