Friday, July 20, 2012

రేషన్ దర్శనమా?

కలియుగ వైకుంఠనాధుని దర్శనానికి రేషన్ విధిస్తున్నారనే వార్త చూడగానే ఈ నిర్ణయం తీసుకున్న వారిని కొరడాతో.. కాదు కాదు చెప్పుతో కొట్టాలన్నంత ఆగ్రహం వచ్చింది.. ఇప్పటికే వీఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనాలతో సామాన్య భక్తులను గంటలు, రోజుల తరబడి ఇబ్బంది పెడుతున్నారు.. దేవున్ని భక్తులకు దూరం చేస్తున్న నీచులను ఏం చేసినా పాపం లేదు.. ఈ నిర్ణయం తీసుకునే హక్కు వీరికి ఎవరిచ్చారు? కోట్లాది రూపాయల స్వామి వారి హుండీని సొమ్ములను భక్తుల సౌకర్యం కోసం వెచ్చించడం చేతగాని పాలక మండలి చివరకు ఇంతటి వికృత నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని కలలో కూడా ఊహించలేదు.. భగవంతుడి ముందు అందరూ సమానమే.. అలాంటప్పుడు తిరుమలలో సాధారణ భక్తులపై ఎందుకీ వివక్షత? పాలకులైనా, వీఐపీలైనా, ధనికులైనా అందరూ ఒకే క్యూలో (చిలుకూరు పద్దతి) దైవ దర్శనం ఎందుకు చేసుకోరు? ఈ విధానాన్ని అమలు చేస్తే శ్రీవారి దర్శనం అందరికీ సులభంగా, వేగంగా పూర్తవుతుంది.. కానీ ఈ విధానాన్ని అమలు చేసే ధైర్యం లేని పాలక మండలి తన ప్రతాపాన్ని సాధారణ భక్తులపైనే చూపుతోంది..

No comments:

Post a Comment