Wednesday, July 25, 2012

రాష్ట్రపతి భవన్లో దాదాగిరి


ఇప్పటి వరకూ రాష్ట్రపతి పదవిని అధిష్టించిన వారి చరిత్రను గమనిస్తే వారెవరూ ఆ పదవిని కోసం తమకు తాము ప్రయత్నించలేదు.. కోరుకోకుండానే వారిని ఆ పదవి వరించింది.. వెంకటస్వామి మాత్రమే రాష్ట్రపతి పదవి కోరుకొని భంగపడి ఉంటారు.. కానీ ప్రణబ్ ముఖర్జీ మాత్రమే పక్కాగా స్కెచ్ గీసి రాష్ట్రపతి పదవిని సాధించుకున్నారు.. ఈ పదవిని పొందిన వారు ఒక రాజకీయాల్లోంచి రిటైర్ అయినట్లే.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో తలపండిన ప్రణబ్ దాదా కోరి మరీ రాష్ట్రపతి పదవి దక్కించుకున్నారంటే ఆలోచించాల్సిన విషయమే..

గతంలోనే ప్రధాని పదవి ఆశించి భంగపడ్డ దాదాకు అది ఏనాటికీ అందని పండే అని స్పష్టంగా తెలుసు.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వ యూపీఏ పరాజయం ఖాయమని చెప్పడానికి జ్యతిష్కులే అవసరం లేదు.. కేంద్రంలో కనీసం మంత్రి పదవైనా రావాలంటే ఇక 2019 ఎన్నికలే గతి.. ఇప్పటికే వయస్సు మీరిపోయిన ప్రణబ్ అప్పటి దాకా ఎదురు చూడటం అత్యాయే.. ఇవన్నీ ఆలోచించే ఆయన మర్యాద పూర్వక రిటైర్మెంట్ కోరుకున్నారు..

అయితే సంకీర్ణ రాజకీయాల్లో రాష్ట్రపతి పదవి రబ్బరు మరీ స్టాంపేమీ కాదు.. ఇంకా చెప్పాలంటే రాష్ట్రపతే కీలక పాత్ర పోషిస్తారు.. సో దాదాజీ రాష్ట్రపతి పదవికి కొత్త నిర్వచనం ఇవ్వబోతున్నారు..

No comments:

Post a Comment