Saturday, July 28, 2012

దేశ హితం లేని మీడియా

అసోంలో జరుగుతున్న మారణహోమంపై జాతీయ మీడియా స్పందన దారుణంగా ఉంది.. తెలుగు మీడియా కవరేజీ అలాగే ఉంది.. బంగ్లాదేశ్ చొరబాటుదారులు మతం పేరిట మన దేశ ప్రజలను ఏరేస్తుంటే ఇదేదో శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో జరిగుతున్న వ్యవహారం అన్నట్లు కేంద్రంలోని యూపీఏ సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది.. అసోం నుండి దొడ్డి దారిన రాజ్యసభకు ఎన్నికై ప్రధానమంత్రి పదవిని వెలగబెడుతున్న మన్మోహన్ సింగ్ తీరుబడిగా వెళ్లి పరామర్శిచి వచ్చారు.. అక్కడ జరుగుతున్న అసలు వాస్తవాలు బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు.. మీడియా ఎందుకు వాస్తవాలను తొక్కిపెడుతోందో అర్థం కావడం లేదు.. ఒకానొక జర్నలిస్టు మిత్రుడు జాతి ప్రయోజనాల దృష్ట్యా కొన్ని విషయాల్లో సంయమనం పాటించాలని హితవు పలికాడు.. ఎంత దారుణంగా మాట్లాడాడో చూడండి...
ఇప్పటికే బంగ్లా చొరబాటుదారుల సమస్యతో ఈశాన్య రాష్ట్రాల జనాభా సమతౌల్యం దెబ్బతింటోంది.. ఇప్పటికే చాలా జిల్లాలు మినీ బంగ్లాదేశ్లుగా మారిపోయాయి.. అక్కడ స్వదేశీ జనం కన్నా విదేశీ జనమే అధికంగా ఉన్నారు.. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితిని ప్రోత్పహిస్తూ వచ్చింది.. అందుకు మూల్యం ఇప్పడు మన దేశం చెల్లిస్తోంది.. చివరగా నాదో ప్రశ్న గుజరాత్ రాష్ట్రంలో గోద్రా సంఘటన తర్వాత జరిగిన అల్లర్లపై ఏళ్ల తరబడిగా గగ్గోలు పెడుతున్న మీడియా, అసోం పరిణామాలపై ఎందుకు అంతగా స్పందించడంలేదు?.. మీడియాకు దేశ హితం పట్టదా?.

No comments:

Post a Comment