Tuesday, August 4, 2015

కలాంజీ ఫేక్ ఫోటో..

నమ్మేవాడుంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అని చెప్పొచ్చు.. అబ్దుల్ కలాం చిన్నప్పుడు సైకిల్ మీద పేపర్లు  వేస్తున్న ఫోటో అంటూ కొత్తగా ఈ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు..
ఆ మధ్య చార్మినార్ నిర్మిస్తున్నప్పటి ఫోటో అని ఫేక్ ఫోటో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టారు.. 420 ఏళ్ల క్రితం ఫోటోగ్రఫీ ఎక్కడిదిరా ఫోర్ ట్వంటీ వెధవా అంటూ నేనా వ్యక్తిని చివాట్లు పెట్టాను.. వాస్తవానికి ఆ ఫోటో ఫలక్ నూమా ఏరియల్ వ్యూ ను మార్ఫింగ్ చేసి సృష్టించారు..

అసలు విషయానికి వద్దాం.. కలాం చిన్నప్పుడు రేంజర్ సైకిల్స్ ఉన్నాయా? రామేశ్వరంలో ఆనాడు ఇంతమంచి రోడ్లు ఉన్నాయా? వీధి దీపాలు కూడా ఆనాటికి కావు.. ఇంకా చెప్పాలంటే ఫోటోలో కనిపిస్తున్న మహిళల వస్త్రధారణ కూడా కలాం ఊరిది కాదు.. ఎవరిని మోసగిద్దామని ఈ ఫేక్ ఫోటో.. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అంటే ఇదే కదూ..

No comments:

Post a Comment