Sunday, August 23, 2015

టాంగ్ టూటీ పీర్ ఖాసిం..

దమ్ముంటే ఇక్కడ కాల్చరా..’ అంటూ పోలీసులకు తన గుండెను చూపించి ధీశాలి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుకు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కూడా మంచి సంబంధాలుండేది.. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్టేట్ కాంగ్రెస్ కు దిశానిర్దేశం కూడా చేసేవారు.. ఆ సందర్భంలో ప్రకాశం పంతులు ఒకసారి తెలంగాణకు వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన నిజాం ప్రభుత్వం ఆయన బస చేసిన ప్రాంతానికి విచారణ కోసం ఓ పోలీసును పంపింది.. అక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుల నడుమ పంతులు గారు ఠీవీగా కూర్చున్నారు.. వచ్చిన పోలీసాయన ఇదర్ టాంగ్ టూటీ పీర్ ఖాసిం  కోన్ హై అంటూ ప్రశ్నించాడు.. పోలీసు చేతిలో ఉన్న లేఖలో టంగుటూరి ప్రకాశం పేరు ఉర్దూలో రాసి ఉంది.. అది ఆయనకు అర్ధం కాక టాంగ్ టూటీ పీర్ ఖాసిం (కాలు విరిగిన పీర్ కాసిం అనుకున్నాడు.. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఒకరి మోహాలు ఒకరు చూసుకొని ఇదర్ కిసీకా టాంగ్ నహీ టూటీ..’ (ఇక్కడ ఎవరి కాలూ విరగలేదు) అని చూపించారు.. అందరి కాళ్లూ పరిశీలించిన పోలీసాయన టాంగ్ టూటీ పీర్ ఖాసి ఎవరూ లేరని నిర్ధారిచుంకొని వెళ్లిపోయారు.. అన్నట్లు ప్రకాశం పంతులుగారు మంచి భోజన ప్రియులు.. ఆ సమావేశంలో పాల్గొన్న వారి కోసం గంపెడు ఇడ్లీలు తెస్తే సగం ఆయనే లాగించారట.. ఈ విషయం దాశరథి కృష్ణమాచార్యుల జీవిత కథ యాత్రాస్మృతిలో రాసి ఉంది..

టంగుటూరి ప్రకాశం పంతులు గారి 143వ జయంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకుందాం..

No comments:

Post a Comment