Wednesday, August 19, 2015

నాగ పంచమి నాడు పాలు వృధా చేయకండి..

సృష్టిలోని ప్రతి ప్రాణిలోనూ పరమాత్మున్ని చూడమని మన సనాతన ధర్మం చెబుతోంది.. పాములు కూడా ఈ సృష్టిలో భాగమే.. విష్ణుమూర్తి పాన్పు ఆదిశేషువు, పరమ శివుని కంఠాభరణం నాగ దేవత.. నాగులను పూజించే సాంప్రదాయమే నాగ పంచమి.
మనం భగవంతుని కోసం పెద్ద మొత్తంలో ప్రసాదాన్ని సిద్దం చేస్తాం.. కాని భగవంతునికి నైవేద్యంగా పెట్టేది కొద్దిగానే.. మిగతాదంతా భక్తులకు ప్రసాదం రూపంలో పంచుతాం.. మరి మనం నాగ పంచమి రోజున పాలను పెద్ద మొత్తంలో పుట్టలో ఎందుకు పోస్తున్నాం.. నాగ దేవత ఎంత అవసరమో అంతే స్వీకరిస్తుంది.. మిగతాదంతా వృధాయే కదా?.. అందుకే భక్తులంతా తాము తెచ్చిన పాలను పెద్ద పాత్రలో పోయాలి. పుట్టలో నైవేద్యంగా కొద్ది పాలను పోస్తే చాలు.. మిగతా పాలను నిరుపేద, అనాధ బాలలకు పంచితే పుణ్యం, పురుషార్థం రెండూ మనకు దక్కినట్లే కదా..

నాగ పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

No comments:

Post a Comment