Thursday, August 20, 2015

రేపిస్టు ఓటు బ్యాంకు సారధి..

ఓటు బ్యాంకు రాజకీయాల విస్తృతి పెరిగింది.. ఇప్పటి వరకూ కుల, మత, ప్రాంత, భాష ఆధారంగా ఓట్లు అడుక్కునేవారు.. ఇప్పుడు రేపిస్టులకూ ఓటు బ్యాంకు తయారు చేశాడో పెద్ద మనిషి.. దేశంలోకెళ్లా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తండ్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, సోకాల్డ్ జనతా పరివార్ సారధి ఆయనే శ్రీమాన్ ములాయం సింగ్ యాదవ్..
మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా ప్రజలు గొంతెత్తి నినదిస్తున్నారు.. చాలా మంది ఇలాంటి వారికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.. కానీ ములాయం మాత్రం అలాంటి వారి పట్ల వకాల్తా పుచ్చుకున్నాడు. అబ్బాయిలు తప్పు చేస్తుంటారు.. అంత మాత్రా వారిని ఉరి వేయాలా?అని అమాయకంగా ప్రశ్నించాడు గతంలో..
తాజాగా ములాయం అంతకన్నా అమాయకత్వాన్న నటిస్తూ వ్యాఖ్యలు చేశాడు.. ‘ సామూహిక అత్యాచారాలు అసాధ్యం.. ఒకరు అత్యాచారం చేస్తే, ప్రతీకారం తీర్చుకోడానికి నలుగురి పేర్లు చెబుతారు..  అని అంటాడీ పెద్దమనిషి..

మహిళలపై అత్యాచారాలను సిగ్గు లేకుండా వెనుకేసుకు వస్తూ, మృగాళ్లను సమర్ధించే ఇలాంటి నాయకులను ఛీ కొట్టాల్సిందే.. లేక పోతే రేపిస్టుల ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా మొదలవుతాయి..

No comments:

Post a Comment