Monday, August 24, 2015

కుక్కతోక, పాకిస్తాన్ వైఖరి ఒకటే..

ఇండియాతో వేయేళ్లయినా యుద్ధం చేస్తామని పాకిస్తాన్ పాలకులు దశాబ్దాల కిందటే ప్రకటించారు.. అందుకు అనుగుణంగానే మన దేశంలో ఉగ్రవాద చర్యలు కొనసాగుతున్నాయి.. భారత వ్యతిరేకతే పాకిస్తాన్ పాలకులకు మనుగడ.. ఇదంతా అక్కడి సైన్యం, ఐఎస్ఐ కనుసన్నల్లో నడుస్తుంది.. పాలకులు నామమాత్రం.. తరాలు మారినా పాకిస్తాన్ విధానంలో మార్పు రాలేదు.. పైగా మరింత వేగంగా వారి కార్యకలాపాలు విస్తరించాయి..
భారత్ తో చర్యలకు సిద్ధం.. కానీ సరిహద్ధుల్లో కాల్పులు జరుపుతాం, దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయిద్ లకు మేపుతాం, కాశ్మీర్ వేర్పాటు వాదులకు దావత్లు ఇస్తూనే ఉంటాం.. ఇదీ పాకిస్తాన్ వైఖరి.. శాంతి చర్చలకు, కాశ్మీర్ కు లింకు.. భారత ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు సంసిద్దత వ్యక్తం చేసినా, ఆ దేశంతో శాంతి ప్రక్రియకు సిద్దమైనా ఈ సామరసర్య వాతావరణాన్ని ఎలా చెడగొట్టుకుందామనే ప్రయత్నిస్తుంది పాకిస్తాన్.. గతంలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ..

పాకిస్తాన్ వైఖరి ఎప్పుడూ కుక్కతోక లాంటిదే.. కుక్కతోక వంకరను సరిచేయలేమూ, పాకిస్తాన్ విధాన్నాన్నీ మార్చలేమూ.. ఇది గత చరిత్ర చెబుతున్న వాతావరణం.. ఇకవైపు ఉగ్రవాదంపై పోరు అంటూ అమెరికా నుండి డాలర్లు రాబట్టుకుంటూ, ఆ ధనాన్ని భారత దేశంలో అభద్రత కోసం వెచ్చించడం నగ్న సత్యం.. ఇలాంటి సైతాను దేశంతో అసలు చర్చలు అవసరమా? ముల్లును ముల్లుతోనే తీయాలి..

No comments:

Post a Comment