Sunday, August 16, 2015

ఆలోచింపజేసిన మాచిస్..

స్కూల్లో మా మాస్టారు అడిగారు.. స్వాతంత్ర్యం ఎలా వచ్చిందని.. రక్తపాతంతో వచ్చిందని చెప్పాను నేను..  అప్పుడు పిల్లవాడినైనా దేశ విభజన విషయాలు బాగా గుర్తున్నాయి..  రక్తపాతంతో అంటావా అని మాస్టారు తరగతి గదిలో నిలబెట్టారు.. మిగతా పిల్లల్ని అడిగారు.. స్వాతంత్ర్యం ఎవరు తీసుకొచ్చి ఇచ్చారని.. దీనికేమైనా సమాధానం ఉందా నువ్వే చెప్పు?.. అరె.. ఒక వ్యక్తి పోయి, పోరాటం చేసి స్వాతంత్య్రాన్ని ఎత్తుకొచ్చేశాడా?.. ఇదిగో తీసుకొండి.. స్వాతంత్ర్యం మీ కోసం తెచ్చాను.. పంచుకోండి అని ఇచ్చాడా?.. తండ్రులు, తాతలు చచ్చింది మావాళ్లు.. ఇళ్లూ, వాకిలి పోగొట్టుకున్నది మేము.. కానీ స్వాతంత్ర్యం తెచ్చింది ఇంకెవరోనట..
1996లో విడుదలైన Maachis (మాచిస్) సినిమాలో సనాతన్ (ఓంపురి), క్రిపాల్ (చంద్రచూడ్ సింగ్)ల మధ్య సంభాషణ ఇది.. ప్రఖ్యాత సినీ కవి, రచయిత గుల్జార్ దర్శకత్వం వహించిన చిత్రం.. ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్ యువతలో ఎలా చిచ్చు రేపిందో, వారి జీవితాలు ఎలా బుగ్గి అయ్యాయో తెలియజేసే ఆలోచనాత్మక, సందేశ చిత్రం మాచిస్..  దేశ విభజనలో భాగంగా పంజాబ్ రాష్ట్రం భారత్, పాకిస్తాన్ల మధ్య చీలిపోయింది. సరిహద్దుల్లో రక్తం పారింది.. సర్వం కోల్పోయిన అభాగ్యులు కట్టుబట్టలతో తరలివచ్చారు.. వారి గోడు పట్టని మన నాయకులు స్వాతంత్రం తెచ్చామంటూ సంబరాలు జరుపుకున్నారు.. మాచిస్ చిత్రంలో సనాతన్ పాత్ర ఈ విషయాన్నే ఎత్తి చూపింది..

మాచిస్ చిత్రంలోని ఈ పంచ్ డైలాగులు అప్పట్లో అందరినీ ఆలోచింపజేశాయి.. ఈ సినిమా విడుదలైన సమయంలో సోకాల్డ్ గాంధీల కుటుంబం దేశంలో అధికారంలో లేదు..  ఉన్నుంటే ఈ డైలగ్స్ సెన్సార్ కత్తెరకు గురయ్యేవేమో?.. 

No comments:

Post a Comment