Sunday, March 31, 2013

జనానికి భారం.. సర్కారుకు ఆనందం


ఏప్రిల్ ఒకటో తేదీ నాడే రాష్ట్ర ప్రభుత్వం జనాలను ఫూల్స్ చేసేసింది.. ప్రజల నెత్తిన విద్యుత్ ఛార్జీల భారం మోపింది..
విద్యుత్ కోతలతో జనం అల్లాడి పోతున్నారు.. నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో జనం బతుకు దుర్భరంగా మారింది.. కోతల కారణంగా తాగు నీటికి, సాగు నీటికి కటకట ఏర్పడింది.. కర్మాగారాలు మూత పడుతున్నాయి.. కొత్తగా ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి..
ఈ ప్రభుత్వానికి కరెంటు సరిగ్గా ఇవ్వడం చేతగాదు.. కేంద్ర నుండో, పొరుగు రాష్ట్రాలను దేబరించో అధనపు విద్యుత్తు తెద్దామన్న ముందు చూపు అసలే లేదు..  పైగా ఎప్పుడో వాడిన కరెంటుకు సర్ ఛార్జీ అంటూ వసూలు చేస్తారు..
ఇలాంటి పరిస్థితిని సరిదిద్ది ప్రజలను కష్టాల భారి నుండి బయట పడేయకుండానే, ఛార్జీలు పెంచే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా? అసలు ఈ రెగ్యులేటరీ అధారిటీ ఏమిటి? ఛార్జీలు పెంచే హక్కు వారికి కట్టబెట్టడం ఏమిటి? ఛార్జీలు పెంచొద్దని అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించినా, నిరాహార దీక్షలు చేసినా చెవిటోడి ముందు శంఖారావం ఊదినట్లే అయ్యింది..
ఉచిత విద్యుత్ ఎవరడిగారు?.. రూపాయికి కిలో బియ్యం ఎవరడిగారు?.. ఇవన్నీ సాకుగా చూపి ప్రజల జేబులు కత్తిరించడం ఏమిటి?.. ఇదేనా సంక్షేమ రాజ్యం?..
కరెంటు ఛార్జీలు పెరిగాయి.. భూములు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగాయి.. రైలు టికెట్ల రేట్లు పెరిగాయి.. రింగు రోడ్డు ఎక్కితే జేబుకు చిల్లే.. ఈ కష్టాలన్నీ మరచిపోయేందుకు ఇంట్లో టీవీ చూద్దామన్నా కష్టమే.. సెట్ అప్ బాక్స్ లేనిదే టీవీ రాదాయే.. హైదరాబాద్ బతుకు ఎంత దుర్భరం అయిపోయింది.. ఏప్రిల్ ఒకటి నాడే ప్రభుత్వం జనాలను ఫూల్స్ చేసేసింది..


No comments:

Post a Comment