Friday, March 1, 2013

ఎందుకీ ఏడ్పులు?

నాయకుడంటే సామాన్య ప్రజల దృష్టిలో తమ కష్టాలు తీర్చేవారు.. మార్గదర్శులు.. ముందు ఉండి పోరాడే వారు.. కానీ వారే కన్నీరు పెట్టేస్తే ఎలా? కన్నీరు పెట్టడం అంటే ఓటమిని అంగీకరించడమే.. ధృడమైన మనస్సుతో ఒకరికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ఏడ్చేస్తే ఎలా? 
ఇక్కడ నేను లోతుల్లోకి పోదలచెకోలేదు కానీ తెలుగుదేశం నాయకులు ఇటీవల ఒక్కోరు ఒక్కో కారణంతో కంట తడి పెట్టడం , వలవలా ఏడ్చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. ప్రజల సమస్యలు చూసి కన్నీరు వచ్చిందని సమర్ధించుకోవచ్చునేమో కానీ వారి కన్నీరు తూడ్చి ధైర్యం చెప్పాల్సిన వారే ఏడ్చేస్తే ఎలా? 
అయితే ఒక రకమైన కన్నీరుకు, విచారానికి మినహాయింపు ఉంది.. దీన్ని అందరూ అర్థం చేస్తుకోవచ్చు.. అత్యంత సన్నిహితులను కోల్పోయినప్పడు లేదా దారుణ సంఘటనలు జరిగినప్పుడు ఎంతటి వారికైనా కన్నీరు వచ్చేస్తుంది.. నిజానికి ఇలాంటి సమయాల్లో కన్నీరు రాని వారు మానవత్వం లేని వారికిందే లెక్క.. కానీ ఇతరత్రా కారణాలకు కన్నీరు పెట్టడంలో ఔచిత్యం ఏమిటో నాకైతే అర్థం కాదు..

No comments:

Post a Comment