Thursday, March 7, 2013

చీకటి రాజ్యం


ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ లేనంతగా విద్యుత్ సంక్షోభంలో పడింది.. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు.. పరీక్షల వేళ కరెంటు కోతలు విద్యార్థులను హడలెత్తిస్తున్నాయి.. మా రోజుల్లో కిరోసిన్ దీపాలు, వీధి లైట్ల కింద చదువుకునేవారం అని పెద్దలు చెప్పుకోవడాన్ని నమ్మలేక పోయిన పిల్లలకు ఇప్పడు అసలు విషయం తెలిసొచ్చింది పాపం..
పట్టణాలకన్నా గ్రామాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.. మోటార్లకు కరెంటు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి.. భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రెండు నెలలు ఇంకెంత గడ్డుగా ఉంటాయో, ఊహించడానికే భయంగా ఉంది..
కరెంటు కోతలతో ఇప్పటికే పారిశ్రామిక రంగం దివాలా తీసే స్థితికి చేరించి.. హైదరాబాద్ శివార్లలో చిన్న తరహా పరిశ్రలు ఎన్నో మూత పడ్డాయి.. కొన్ని వేల మంది ఉపాధికి ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది.. ఉత్పాదన, ఉపాధి అవకాశాలే దెబ్బతిన్నప్పుడు రాష్ట్రం ఎలా అభివృద్ధి సాధిస్తుంది?..
ప్రాజెక్టుల్లో నీరే లేనప్పడు జల ఉత్పత్తి ఎలా చేస్తారు? గ్యాసే లేనప్పడు గ్యాస్ ఆధారిత ఉత్పత్తి అసాధ్యంగా మారింది.. భారమంతా థర్మల్ విద్యత్తు పైనే పడింది.. అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? ముందు చూపులేని చేతగాని ప్రభుత్వమే.. విద్యుత్తు ఛార్జీలు అడ్డగోలుగా పెంచేసి ప్రజలను దోచుకోవడంలో చూపే శ్రద్ధలో పదో వంతైనా విద్యుత్తు రంగ సంక్షోభం నుండి గట్టెక్కడం పై పెట్టి ఉంటే ఈ కష్టాలు వచ్చి ఉండేవా?


ముఖ్యమంత్రి సైతం విద్యుత్తు సంక్షోభాన్ని అంగీకరిస్తూ చేతులెత్తేసినప్పుడు ఇక ఈ రాష్ట్ర ప్రజలకు దిక్కెవరు? ఆంధ్ర ప్రదేశ్ కాస్తా అంధేరాప్రదేశ్ గా మారిపోయింది..

No comments:

Post a Comment