Saturday, March 2, 2013

మొద్దు చర్మాలు భరిస్తున్నాయి

 మళ్లీ పెట్రోలు రేటు పెరిగింది.. సామాన్యుడి నడ్డి విరిగిందని ప్రతి పక్షాలు గోల పెట్టేశాయి.. ధరను తగ్గించే దాకా ఉద్యమిస్తాం.. ప్రభుత్వం మెడలు వంచుతాం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాయి..

ఈలోగా నాలుగు రోజులు గడచిపోతుంది.. ప్రజలకు నొప్పి తగ్గిపోతుంది.. ప్రతిపక్షాలు మౌనంగా ఉండిపోతాయి.. అదను చూసి మరోసారి ప్రభుత్వం పెట్రోలు ధరను పెంచేస్తుంది.. మళ్లీ సీన్ రిపీట్..
యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజీల్, గ్యాసు ధరలు లెక్కలేనన్నిసార్లు పెరిగాయి.. 2013 సంత్సరంలో మూడు సార్లు పెట్రోలు ధర పెరిగితే.. పక్షం రోజుల్లోనే రెండు సార్లు వాత పడింది.. ఇలా ఎన్ని సార్లు పెట్రో పడ్డా భరించే రీతిలో దేశ ప్రజలకు ప్రజలకు మొద్దు చర్మం వచ్చేసింది..

No comments:

Post a Comment