Saturday, March 9, 2013

హట్సాప్ దివాన్ సాబ్..

 పాకిస్తాన్ ప్రధానమంత్రి రజా పర్వేజ్ అష్రాఫ్ కు పరాభవం ఎదురైంది.. ఆజ్మీర్ లోని ప్రఖ్యాత ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు పాక్ ప్రధాని.. దర్గా దివాన్ జైనుల్ అబేదిన్ అలీఖాన్ అష్రాఫ్ రాకను వ్యతిరేకించారు.. ఇటీవల సరిహద్దులో భారత జవాన్ల తలలు నరికిన పాకిస్తాన్ కనీసం క్షమాపణ అయినా చెప్పనందుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.. మతం కన్నా దేశ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన అలీఖాన్ సాబ్ కు నిజంగా దేశ ప్రజలు జేజేలు చెప్పాలి..

ఒకవైపు దర్గా దివాన్ పాకిస్తాన్ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తే, ఘనత వహించిన మన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికి గౌరవార్ధం విందు కూడా ఇచ్చారు.. సరే అతిధి దేవో భవ అని విందు ఇచ్చారనే అనుకుందాం.. పనిలో పనిగా నిరసన తెలిపితే ఎంత హుందాగా ఉండేది..

No comments:

Post a Comment